తెలంగాణలో లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ఆరోగ్యశాఖ అధికారులతో ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జరుగుతున్న వ్యాక్సినేషన్, కరోనా నివారణ చర్యలు, కరోనా చికిత్స, ఆక్సిజన్ నిల్వలు, రెమిడిసివర్ ఇంజెక్లన్లు.. పై ప్రధానంగా చర్చించారు. ఈనేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ పెట్టిన రాష్ట్రాల్లో కేసులు తగ్గడం లేదని అన్నారు. లాక్డౌన్ పెట్టడం వల్ల జనజీవనం స్తంభీంచిపోతుందని అన్నారు.
దీని వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని అన్నారు. ఈక్రమంలో వ్యాక్సిన్లు, రెమ్డెసివిర్ సరఫరాపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తమిళనాడులోని పెరంబదూరు, కర్ణాటకలోని బళ్లారి నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఆక్సిజన్ రావడం లేదని ప్రధాని దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. వాటిని రాష్ట్రానికి వచ్చేలా చూడాలని కోరారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. హైదరాబాద్ కు బాధితులు ఎక్కువగా రావడం వల్లే భారం పెరిగిందని ప్రధానితో అన్నారు.
214057 861887We clean up on completion. This could sound obvious but not several a plumber in Sydney does. We wear uniforms and always treat your home or workplace with respect. 857576