కరోనా వైరస్ ప్రభావంతో ఏపీలో పరీక్షలన్నీ రద్దయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించకూడదని సర్కారు నిర్ణయించింది. వారందరినీ తదుపరి తరగతికి ప్రమోట్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, పదో తరగతి పరీక్షల నిర్వహణపై తదుపరి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నట్టు పేర్కొంది.
వాస్తవానికి ఈనెల 31 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. తొలుత వాటిని యథాతథంగా నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే, తెలంగాణలో పరీక్షలు జరుగుతుండగా వాటిని వాయిదా వేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేయడంతో తెలంగాణ ప్రభుత్వం వాటిని వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా పరీక్షలు జరపడం సబబు కాదని నిర్ణయానికి వచ్చిన సర్కారు.. లాక్ డౌన్ ముగిసే వరకు వాటిని వాయిదా వేసింది.
ఏప్రిల్ 15న పరిస్థితులను బట్టి పదో తరగతి పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలనే నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన తరగతుల పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదనే భావనతో వాటిని రద్దు చేస్తూ.. అందరినీ పై క్లాస్ కి పంపించేలా ఉత్తర్వులు వెలువరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏపీ అదే బాటలో వెళ్లాలని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు 10కి చేరుకున్నాయి.
మరోవైపు గురువారం సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
176463 691454Id always want to be update on new articles on this web web site , saved to favorites ! . 457745