బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని ముందుగానే వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే తాజాగా తుఫాన్ కదలికలను బట్టి చూస్తుంటే ఏపీకి అత్యంత ప్రమాదకరంగా నివర్ తుఫాన్ మారినట్లుగా వాతావరణ శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
లోతట్టు ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా విధుల్లో ఉండి జనాల అవసరాలను తీర్చాలంటూ ప్రభుత్వం నుండి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు తుఫాన్ ప్రభావం పై చర్చిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ సీఎఎస్ ఆదేశించారు. నివర్ తుఫాన్ తీరం దాటే సమయంలో విపరీతమైన గాలులు వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో ప్రాణ నష్టం జరుగకుండా చూసుకోవాలన్నారు.
653759 669764Hi, Neat post. Theres a difficulty with your internet site in internet explorer, would test this IE still will be the market leader and a big portion of folks will miss your wonderful writing because of this issue. 751494