ప్లాపుల్లో ఉన్నా కూడా నితిన్ తన మార్కెట్ ను కోల్పోలేదు. వరసగా 12 సినిమాలు హిట్ అవ్వకపోయినా నితిన్ కెరీర్ కు ఢోకా లేకుండా పోయింది. ఇష్క్ చిత్రంతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వరసగా విజయాలు అందుకున్నా మళ్ళీ కెరీర్ లో స్లంప్ వచ్చింది. అయితే భీష్మ సినిమాతో వచ్చిన విజయం ఆ స్లంప్ ను తుడిచిపెట్టేసింది. ఆఫ్ సీజన్ లో విడుదలైనా కానీ భీష్మ సూపర్ సక్సెస్ ను అందుకోవడం విశేషం. అలాగే నితిన్ కూడా ఈ సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రాన్ని జీ తెలుగు వారు భారీ రేటు పెట్టి సాటిలైట్ హక్కులు సొంతం చేసుకోవడం విశేషం.
భీష్మ తర్వాత నితిన్ చేస్తోన్న చిత్రం రంగ్ దే. కీర్తి సురేష్ కథానాయికగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం జులై లో విడుదలకు షెడ్యూల్ అయింది. అయితే ఈలోగా కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడిన విషయం తెల్సిందే. భీష్మ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది.
అదే కాంబినేషన్ కావడంతో బిజినెస్ పరంగా భరోసా పెరిగింది. అందుకే ఈ చిత్రానికి విడుదలకు చాలా ముందే సాటిలైట్ డీల్ క్లోజ్ అయిపొయింది. భీష్మ చిత్రాన్ని కొనుగోలు చేసిన జీ తెలుగు రంగ్ దే ను కూడా దాదాపు 10 కోట్లు ఇచ్చి కొనుగోలు చేయడం విశేషం.
ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ కావడం విశేషం.
575177 367043Some genuinely good stuff on this internet site , I it. 816896
750046 622452extremely nice post, i really enjoy this web site, carry on it 493528
526255 828750This can indicate that a watch has spent some or all of its life inside the tropics and was not serviced as regularly as it should have been. 25533