అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి నైరుతి దిశగా కదులుతోంది. ఈ తుఫాన్తో మహారాష్ట్ర, గుజరాత్లతో పాటు పలు రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందంటూ వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్ తీవ్రత నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. విపత్తు విభాగంతో పాటు పలు విభాగాలకు చెందిన వారిని కూడా అలెర్ట్ చేయడం జరిగింది.
నేడు వాయుగుండంగా మారిన ఈ తుఫాన్కు నిసర్గ అనే పేరును పెట్టారు. జూన్ 3వ తారీకున ఈ తుఫాన్ తీరంను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. తుఫాను తీరం తాకే సమయంలో మహారాష్ట్రలో 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇక గుజరాత్తో పాటు తీర ప్రాంతాల్లో 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పటికే తీర ప్రాంత జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దంటు చేపలు పట్టే వారికి సూచించడం జరిగింది.
జూన్ 3, 4, 5 తేదీల్లో నిసర్గ ప్రభావం దేశంలో ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాను తీవ్రత నేపథ్యంలో స్వయంగా అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగకుండా జాతీయ విపత్తు టీంలు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్బంగా కేంద్ర హోం శాఖ మంత్రి ఆదేశించారు.
615040 893289you use a wonderful weblog here! do you need to have to make some invite posts on my blog? 707891
376117 13277I dont normally look at these types of websites (Im a pretty modest person) – but even though I was a bit shocked as I was reading, I was definitely a bit excited as nicely. Thanks for making my day 681725
998663 163426Yeah bookmaking this wasnt a risky determination outstanding post! . 456246