Switch to English

నిమ్మగడ్డ లేఖ రగడ: రాసింది ఆయనేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ లేఖ వెలుగులోకి వచ్చి దాదాపు నెలరోజులు అవుతున్నా.. అది రాసింది ఎవరనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. తాజాగా ఈ లేఖ రాసింది తానేనని.. ఇందులో ఇతరులకు ఆందోళన అనవసరమంటూ రమేశ్ కుమార్ ఖండించినట్టుగా వార్తలొచ్చాయి.

అయితే, ఆయన నేరుగా మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వకపోవడంతో ఇందులో నిజమెంత అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం జగన్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న రమేశ్ పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. కులం ఆపాదించి విమర్శలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. అనంతరం సుప్రీంకోర్టుకు వెళ్లగా.. ఎన్నికల వాయిదాను సమర్థించింది. అయితే, ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో గతనెల 18న తనకు భద్రత కల్పించాలంటూ రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖకు 5 పేజీల లేఖ రాసినట్టుగా మీడియాలో వార్తలొచ్చాయి. అయితే, ఆ లేఖ రాసింది ఆయనేనా.. కాదా అనే అంశంపై అప్పట్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ లేఖ రాసింది మీరేనా అని రమేశ్ ను అడిగినా.. ఆయన ధ్రువీకరించలేదు. ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్ఐ తో మాత్రం తాను ఆ లేఖ రాయలేదని వెల్లడించడం గమనార్హం. పైగా రమేశ్ కుమార్ సంతకానికి.. లేఖలో ఉన్న సంతకానికి భారీ తేడా ఉంది. రెండు లేఖలను పోల్చి చూస్తే ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు కేంద్ర హోంశాఖ మాత్రం తమకు ఎస్ఈసీ నుంచి లేఖ అందిందని ధ్రువీకరించింది. అయితే, ఈ లేఖపై ఇంత రగడ జరుగుతున్నప్పటికీ, రమేశ్ కుమార్ మాత్రం మీడియా ముందుకు వచ్చి ఎలాంటి వివరణా ఇవ్వలేదు.

ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈ లేఖపై దర్యాప్తు జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. లేఖలోని సంతకంలో తేడా ఉందని, ఇది టీడీపీ కార్యాలయంలో తయారైనట్టుగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రమేశ్ నుంచి వివరణ వచ్చినట్టుగా వార్తలొచ్చాయి. వాస్తవానికి ఆయన నేరుగా మీడియాకు ఈ విషయం చెప్పకపోవడంతో అధికార పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పైగా లేఖ వ్యవహారం నెలరోజులుగా సాగుతున్నా.. రమేశ్ కుమార్ ఒక్కసారి కూడా ఖండించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేయగానే ఈ ప్రకటన రావడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ నిజంగా రమేశ్ కుమారే ఈ లేఖ రాసి ఉంటే.. నేరుగా మీడియా ముందుకు వచ్చి చెబితే సరిపోతుంది కదా అని పేర్కొంటున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

ఎక్కువ చదివినవి

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

Raghu Babu: నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకర్ మృతి..

Raghu Babu: సినీ నటుడు రఘుబాబు (Raghu Babu) ప్రయాణిస్తున్న కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్ పరిధిలో జరిగింది. నల్గొండ బైపాస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో కారు ఢీకొని...