పోతిరరెడ్డిపాడు సామర్థ్యం పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ దూకుడికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బ్రేక్ వేసింది. ఈ ప్రాజెక్టు కారణంగా పర్యావరణంపై పడే ప్రభావం గురించి అధ్యయనం చేసి ఇచ్చేందుకు నాలుగు శాఖలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నివేదిక ఇచ్చేందుకు రెండు నెలల గడువు ఇచ్చింది. అప్పటివరకు ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి వీల్లేదని పేర్కొంటూ స్టే విధించింది.
ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో ఏపీ బోర్డు ముందు తన వాదనలు వినిపించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయడంతో బోర్డు.. వాటిపై తెలంగాణ సర్కారు నుంచి వివరణ కోరింది. ఈ నేపథ్యంలో ఎన్జీటీ అనూహ్యంగా తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్టుపై నారాయణపేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన ట్రిబ్యునల్.. కృష్ణా బోర్డు, కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్ కు చెందిన వ్యక్తులతో కమిటీ నియమించింది. ఈ కమిటీ నివేదిక ఇచ్చేవరకు ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి అవకాశం లేకుండా పోయింది.
నేడో, రేపో పోతిరెడ్డిపాడుపై టెండర్లు పిలవాలని యోచిస్తున్న జగన్ సర్కారుకు ఇది ఎదురుదెబ్బగా పరిణమించింది. రూ.7వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లకుండా చూడాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కృష్ణా బోర్డును ఆదేశించడంతో.. బోర్డు ఎలాంటి చర్యలూ చేపట్టొద్దని ఇప్పటికే ఏపీ సర్కారుకు సూచించింది. అయినప్పటికీ, ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్లు పిలవడానికి ఏపీ సమాయత్తమైన తరుణంలో ఎన్జీటీ బ్రేక్ వేసింది.
663002 285539Thanks for the write up! Also, just a heads up, your RSS feeds arent working. Could you take a look at that? 684217
481238 635660I like this web site quite a lot, Its a genuinely nice situation to read and get info . 601442
252694 188833It is hard to find knowledgeable men and women on this subject nonetheless you sound like you know what youre talking about! Thanks 457990
430450 597539You can certainly see your skills in the work you write. The world hopes for much more passionate writers like you who arent afraid to say how they believe. At all times follow your heart 606032