ప్రాణాంతక కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు 14 గంటలపాటు జనతా కర్ఫ్యూ పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభించింది. ఆదివారం ఇండియా మొత్తం ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది మినహా సాధారణ ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించింది.
దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే 400 రైళ్లు మినహా మిగిలిన రైళ్లు పట్టాలెక్కలేదు. అలాగే ప్రజా రవాణా బస్సులు కూడా డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వాహనాలు సైతం రోడ్డెక్కలేదు. గ్రామాలు సైతం జనతా కర్ఫ్యూలో పూర్తిగా భాగస్వామ్యమైంది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ జనతా కర్ఫ్యూని స్వచ్ఛందంగా పాటించారు. ఇక జనతా కర్ఫ్యూని మరికొన్ని రోజులు పొడిగించేందుకు పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. రాజస్థాన్, పంజాబ్ లు ఈనెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించగా.. మధ్యప్రదేశ్ ఈనెల 24 వరకు జనతా కర్ఫ్యూ పాటించనుంది.
జార్ఖండ్, తమిళనాడు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగించనున్నారు. ఇక ఏపీలో కూడా మరో మూడు రోజులు జనతా కర్ఫ్యూ పాటించాలని హోంమంత్రి సుచరిత సూచించారు. విజయవాడలో తాజాగా కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ కావడంతో ప్రజలు ముందుజాగ్రత్తగా మరో మూడు రోజులు కర్ఫ్యూ పాటించాలని పోలీసులు కూడా విన్నవించారు. మరోవైపు కరోనా వైరస్ నివారణకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 31 వరకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు రద్దు చేయాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడ్డ 75 జిల్లాల్లో ఈనెల 31 వరకు లాక్ డౌన్ చేయాలని స్పష్టంచేశారు. ఇక గూడ్స్ మినహా మిగిలిన అన్ని రైళ్లనూ 31 వరకు నిలిపివేశారు. మెట్రో సర్వీసులు కూడా ఆపేవేయనున్నారు. రోజురోజుకూ పరిస్థితి తీవ్రం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
126791 317779You produced some decent points there. I looked on the net towards the concern and located a lot of people go together with together together with your internet site. 159451
391071 133607I like this internet site because so much beneficial material on here : D. 773807