కరోనా మహమ్మారి వలన దేశంలో ఏ టు జెడ్ అన్నీ బంద్ అయ్యాయి. అందులో దేవాలయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే తిరుమలని కూడా మూసేసారు. దానికి కారణం తిరుమలకి పలు రాష్టాల నుంచి, దేశాల నుంచీ ప్రజలు దర్శనానికి వస్తుంటారు. వారిలో ఎవరికి కరోనా ఉన్నా కంట్రోల్ చేయడం చాలా కష్టమని తిరుమలని బంద్ చేశారు. కానీ లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ఒక్కోక్కటికీ ఓపెన్ చేస్తున్నందున తిరుమలని కూడా ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యారు.
అందులో భాగంగా తిరుమల దర్శనానికి సరికొత్త ఆంక్షలతో కూడిన ప్రణాళికని సిద్ధం చేసింది. తిరుమలేశుని దర్శనం ఇక మీదట రోజుకి 14 గంటలు మాత్రమే జరుగుతుంది. అది కూడా గంటకి 500 మందిని మాత్రమే దర్శనానికి పంపిస్తారు. ఈ లెక్కన 14 గంటల్లో కేవలం 7,000 మందికి మాత్రమే రోజుకి దర్శనం జరుగుతుంది. తిరుమలకి లాక్ డౌన్ ఎత్తివేసిన మొదటి 3 రోజులు మాత్రం టీటీడీ ఉద్యోగులకి మాత్రమే దర్శనం, ఆ తర్వాత తిరుమల తిరుపతిలోని స్థానికులకు దర్శనం ప్లాన్ చేస్తోంది. ఇలా 15 రోజుల ప్రయోగాత్మక దర్శన విధానాన్ని అమలు చేసాక మొదట సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం టికెట్లను భక్తులకు టీటీడీ అందుబాటులోకి తీసుకొస్తుంది. టీటీడీ టికెట్స్ కలిగిన వారిని మాత్రమే అలిపిరి వద్ద పైకి వెళ్ళడానికి అనుమతినిస్తుంది. ఇలాంటి ప్రభుత్వం దర్శనానికి అనుమతినివ్వడం కోసం ఓ ప్రక్రియని సిద్ధం చేసింది. త్వరలోనే దీనికి అనుమతి రానుందని సమాచారం.
206409 268684In case you happen to excited about eco items, sometimes be tough shock to anyone them recognise that to help make unique baskets just for this quite liquids carry basic steps liters associated ceiling fan oil producing. dc free mommy blog giveaways family trip home gardening home power wash baby laundry detergent 209852