China: చైనా (China) లో మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. కరోనా (Covid) కేసులతో అల్లాడిన చైనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) XBB వేరియంట్ కారణంగా ఏప్రిల్ నుంచి రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మే చివరి నాటికి 4కోట్లు.. జూన్ నెలాఖరుకు 6.5కోట్లు కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
దీంతో చైనా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు తీసుకొచ్చామని.. మరో రెండు వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నామని చైనా అధికారింగా వెల్లడించినట్టు ఆ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అధికంగానే ఉన్నా.. తీవ్రత తక్కువేనని అంటున్నారు. అయితే.. వృద్ధులు ఈ వేరియంట్ తో జాగ్రత్తగా ఉండాలని వారిపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుత వేరియంట్ మనిషిలోని రోగనిరోధక శక్తిని దాటుకుని చొచ్చుకుపోయే గుణం వల్ల కేసులు పెరుతున్నట్టు తెలుస్తోంది. చైనాలో గత డిసెంబర్ లో జీరో కోవిడ్ విధానం ఎత్తివేసాక దాదాపు దేశంలోని 85శాతం మంది అనారోగ్యానికి గురైనట్టు వార్తలు వచ్చాయి.