కొత్తగా అందుబాటులోకి వచ్చిన 104, 108 అంబులెన్సుల తరలింపులో చిన్న అపశృతి జరిగింది. సీఎం జగన్ విజయవాడలో జెండా ఊపి ప్రారంభించిన ఈ సర్వీసుల్లో సుమారు 70 వాహనాలు మచిలీపట్నం వైపు బయలుదేరాయి. ఈరోజు మధ్యాహ్నానికి అన్ని గమ్యస్థానాలకు చేరుకునేలా అధకారులు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో గమ్యస్థానాలకు బయలుదేరిన ఆంబులెన్సుల్లో మూడు ఒకదానికొకటి గుద్దుకుని పాక్షికంగా దెబ్బతిన్నాయి.
సమాచారం అందుకున్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వాటిని టోవింగ్ చేసి పక్కకు నిలిపారు. వెంటనే ట్రాఫిక్ ను పునరుద్దరించారు. ముందువెళ్తున్న ఆంబులెన్స్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న రెండు ఆంబులెన్సులు ఒకదాని వెనుక ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలకు ముందు, వెనుక భాగాలు దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వీటిలో సాంకేతిక లోపం ఏమీ లేదని.. మరమ్మత్తులు చేపట్టి త్వరలోనే గమ్యస్థానాలకు చేరుస్తామని అధికారులు తెలిపారు.
ఈరోజు ఉదయం సీఎం జగన్ అధునాతన సౌకర్యాలతో సిద్ధమైన ఆంబులెన్సులను విజయవాడలోని బెంజిసర్కిల్ లో ప్రారంభించారు. రూ. 201కోట్లతో 1068 కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు పాల్గొన్నా
645251 93394I truly treasure your piece of function, Excellent post. CHECK ME OUT BY CLICKING MY NAME!!! 934414
54414 258938When I saw this page was like wow. Thanks for putting your effort in publishing this article. 284574