Switch to English

బిగ్ క్వశ్చన్: రాజకీయ నేరాల్ని కూటమి ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,800FansLike
57,764FollowersFollow

జనసేన నేతలు, కార్యకర్తలపై దాడులు.! బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు.! దాడులు చేస్తున్నదేమో వైసీపీ నేతలు, కార్యకర్తలు.!

ఇదేమీ వైసీపీ హయాం కాదు.! అప్పట్లో అయితే, పైన చెప్పుకున్న నేరాలు నిర్లజ్జగా జరిగాయ్. హత్యలు జరిగినా, అత్యాచారాలు జరిగినా అప్పట్లో పోలీసు వ్యవస్థ చేష్టలుడిగి చూసింది. ‘ఒకట్రెండు రేప్‌లకే రాద్ధాంతమా.?’ అని అప్పట్లో ఓ మహిళా మంత్రి సెలవిచ్చారు.

హోంమంత్రిగా మహిళ వుండి కూడా అప్పట్లో, అఘాయిత్యాలపై స్పందిస్తూ, ‘రేప్ చేయాలని నిందితులు రాలేదు.. అనుకోకుండా జరిగిపోయింది..’ అని చెప్పడం చూశాం. నేరాలు అప్పట్లో ఎంత సర్వసాధారణంగా మారిపోయాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

ఆ నేరాల నుంచి ప్రజలూ విసిగిపోయారు. వైసీపీని పాతరేశారు. మరి, కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు ఎలా వున్నాయి.? నిజానికి, నేరాలు అదుపులోకి వచ్చాయి. నేరాల పరంగా ‘జీరో’ అనేది చూడలేం. అది అసాధ్యం కూడా.! కానీ, నేరాల్ని కొంతమేర అదుపు చేయడం సాధ్యమవుతుంది. అదుపు చేస్తోంది కూడా ప్రస్తుత ప్రభుత్వం.

అయితే, రాజకీయ నేరాలు మాత్రం అదుపులోకి రావడంలేదు. కూటమి పాలనలో, కూటమి పార్టీల నేతలు, నాయకులపై దాడులు జరుగుతూనే వున్నాయి. మరీ ముఖ్యంగా, టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు నిత్యకృత్యమైపోయాయి.

ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ, ఆ అక్కసుతోనే తమ మీద దాడులు చేస్తోందన్నది టీడీపీ ఆరోపణ. కేవలం ఆరోపణలు చేస్తే సరిపోదు, అధికారంలో వుంది కాబట్టి, తగిన చర్యలు తీసుకోవాల్సింది టీడీపీ అధినాయకత్వమే.

దాడులకు ప్రతిదాడులు ఎప్పుడూ సమాధానం కాదు. భౌతిక దాడులకు ప్రజాస్వామ్యంలో చోటుండకూడదు. కానీ, హత్యలు జరుగుతున్నాయ్.. కార్యకర్తల్ని కోల్పోతోంది తెలుగుదేశం పార్టీ. ‘ఇలాగైతే, టీడీపీ జెండాలు మోయడానికి కార్యకర్తలు మిగలరు..’ అంటూ పార్టీ కార్యకర్తలు, నేతలు.. అధినాయకత్వంపై గుస్సా అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

డీజీపీకి ముఖ్యమంత్రి అల్టిమేటం జారీ చేశారన్న వార్త కూడా, టీడీపీ కార్యకర్తల్లో మనో ధైర్యం నింపడంలేదంటే, పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

ఓ వైపు, ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు, పుండు మీద కారం చల్లినట్లున్నాయి టీడీపీ నేతలు, కార్యకర్తలకి. ఆ రెడ్ బుక్ రాజ్యాంగమే అమలైతే, తమ కార్యకర్తలు ఎందుకు చనిపోతారన్నది టీడీపీ క్యాడర్ వ్యక్తం చేస్తున్న ఆవేదన.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో, టీడీపీ కార్యకర్తల చావులు.. అదీ వైసీపీ నేతల రాజకీయ దాడుల్లో.. అంటే, అది ఆషామాషీవ్యవహారం కాదన్నది టీడీపీ క్యాడర్ నుంచి వ్యక్తమవుతున్న ఆవేదన, బాధ.

రాజకీయ దాడులపై ఉక్కుపాదం మోపాల్సిందే.. తప్పదు.! లేదంటే, సమాజంలో అలజడులు తీవ్రమవుతాయి. అది, రాష్ట్రానికి అస్సలు మంచిది కాదు.

ఇదే అభిప్రాయం, కూటమిలో టీడీపీకి మిత్రపక్షాలు అయిన జనసే, బీజేపీ నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. సాధారణ నేరాలు అదుపులోకి వచ్చినా, రాజకీయ పరమైన నేరాలు, అదీ వైసీపీ క్యాడర్ చేస్తన్న అరాచకాలకు అడ్డకట్ట వేయకపోతే ఎలా.? అంటూ ఆవేదన చెందుతున్న తెలుగు తమ్ముళ్ళకు ఇకనైనా అధినాయకత్వం నుంచీ, తమ ప్రభుత్వం నుంచీ భరోసా లభిస్తుందా.? వేచి చూడాల్సిందే.

సినిమా

సూపర్ హిట్ SVCC బ్యానర్ లో మాచో స్టార్ గోపీచంద్ సినిమా..!

మాచో స్టార్ గోపీచంద్ సక్సెస్ ఫుల్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో...

ఈ అభిమానం ఎగ్జైట్ చేస్తుంది : విజయ్ దేవరకొండ

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. తన సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ అనే...

సారంగపాణి నుంచి తెల్లా తెల్లారినాదో సాంగ్ రిలీజ్..!

స్టార్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తూ వస్తున్న ప్రియదర్శి కమెడియన్ గా తన మార్క్ చాటుతున్నాడు. మరోపక్క మల్లేశం, బలగం, 35, కోర్ట్ లాంటి...

ఓటీటీ లోకి వచ్చేస్తున్న “బ్రోమాన్స్”.. ఎప్పుడు? ఎక్కడంటే..

ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అక్కడి థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలను తెలుగు వెర్షన్ లోకి తీసుకొస్తున్నారు. అలా ఇటీవల...

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

రాజకీయం

పహల్గామ్ ఘటన: పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా.?

పాకిస్తాన్‌ పౌరుల్ని దేశం నుంచి వెళ్ళగొడుతూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిిస్తాన్ నీటి అవసరాల్ని తీర్చే నదీ ఒప్పందాల్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇంతేనా.? ఇంకా ముందు ముందు...

కాళ్లు పట్టుకున్నా వదల్లేదు.. మతం అడిగిమరీ చంపారు

జమ్మూ కశ్మీర్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్...

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

ఎక్కువ చదివినవి

రౌడీ కొత్త బ్రాంచ్.. విజయ్ దేవరకొండ నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ..!

యూత్ లో సూపర్ ఫాలోయింగ్ ఉన్న క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు తన ఎనర్జీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సినిమా హీరోగా కెరీర్ కొనసాగిస్తూనే బిజినెస్ లో కూడా రాణిస్తున్నాడు. విజయ్...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం...

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కష్టమేనా..?

విజయ్ దేవరకొండ గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న కింగ్ డమ్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్స్...

కీరవాణి, చంద్రబోస్ లపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, పాటల రచయిత చంద్రబోస్ ల మీద సంచలన ఆరోపణలు చేసింది సింగర్ ప్రవస్తి ఆరాధ్య. పాడుతా తీయగా షో గురించి అందరికీ తెలిసిందే. ఎస్పీ...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల...