National Blood donation Day: ‘రక్తదానం’ విలువ చాటిచెప్పిన చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,402FansLike
57,764FollowersFollow

National Blood donation Day: అభిమానులను హీరోలు అభిమానులుగానే కాకుండా సమాజ సేవకులుగా, వారికో గౌరవం తీసుకొచ్చే బాధ్యత తీసుకున్న హీరో దేశంలో ఎవరైనా ఉన్నారా..? అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ‘చిరంజీవి’ మాత్రమే. జనరేషన్ మారిన తర్వాత కాకుండా.. తన ప్రైమ్ టైమ్ లోనే అభిమానులను బ్యానర్లు, కటౌట్లు కట్టడం కంటే సమాజ సేవ ముఖ్యమని మలచడం అత్యంత అరుదైన విషయం. హీరోల పేరు మీద సేవా కార్యక్రమాలు చేసే అభిమానులున్నారు కానీ.. హీరోనే అభిమానులను సేవా మార్గంలో పయనించేలా చేయడం.. అభిమానులూ తమ హీరో మాటే శిరోధార్యంలా భావించి.. దశాబ్దాలుగా సేవా మార్గంలో పయనించడం మరీ అరుదు. ఇవన్నీ సాధ్యమైంది మెగాభిమానులతో.. సుసాధ్యం చేసింది మెగాస్టార్ చిరంజీవి. ఆ సేవా కార్యక్రమే ‘రక్తదానం’. నేడు ‘National Voluntary Blood Donation Day’.

ఓ దినపత్రికలో.. రక్తం అందక ఒక ప్రాణం పోయిందనే వార్త చిరంజీవిని కదిలించింది. దీంతో చిన్ననాటి నుంచి ఉన్న సేవా మార్గమే మెగాస్టార్ అయ్యాక కూడా కొనసాగింది. రేపటికి (అక్టోబర్ 2, 1998) 27ఏళ్లు పూర్తి చేసుకుంటున్న ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్టు’ అలా ప్రారంభించిందే. రక్తం అందక ప్రాణం పోకూడదనే ఉద్దేశంతో చిరంజీవి ప్రారంభించిన ట్రస్టు ‘చిరంజీవి బ్లడ్ బ్యాంకు’గా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టింది. ‘రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి’ అని చిరంజీవి 1998లో ఇచ్చిన పిలుపు నేటికీ అభిమానుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఫలితంగా లక్షలాది మంది అభిమానులు ఇన్నేళ్లలో రక్తదానం చేశారు. ఊరూ వాడా.. అభిమానులు చిరంజీవి పుట్టినరోజుకి సైతం బ్లడ్ బ్యాంకు స్థాపించి రక్తదానం చేయడం.. చేయించడం చేస్తూ రక్తం సేకరించి చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు అందేలా చేశారు.

నేటికి నిరంతరంగా కొనసాగుతున్న బ్లడ్ బ్యాంక్ ద్వారా 15లక్షలకు పైగా యూనిట్ల రక్తం సేకరించారు. చిరంజీవి సొంత నిధులతో రక్తం ఎవరికి ఎక్కడ అవసరం ఉన్నా అందేలా చేస్తున్నారు. హైదరాబాద్-సికింద్రాబాద్ పరిధిలోనే ఇన్నేళ్లలో దాదాపు 20లక్షల మందికి.. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలలో దాదాపు 15లక్షల మందికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం అందంచి ప్రాణాలు నిలిపింది చిరంజీవి బ్లడ్ బ్యాంక్. చిరంజీవి పిలుపుకి స్పందించి 50, 100సార్లు రక్తదానం చేసిన వారున్నారు. అత్యధికంగా రక్తదానం చేసిన వారికి చిరంజీవి ఇన్సూరెన్స్  పాలసీ చేయించారు. బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసిన వారికి చిరంజీవి. రామ్ చరణ్ సంతకం చేసిన సర్టిఫికెట్ తోపాటు ఐడెంటిటీ కార్డు ఇస్తున్నారు. ఈ కార్డుతో ఏడాదిపాటు ఆపదలో ఉన్నవారికి ఇక్కడ నుంచి రక్తం అందించవచ్చు.

చిరంజీవి-పవన్ కల్యాణ్-రామ్ చరణ్ పుట్టినరోజున మెగాభిమానులు చేపట్టే రక్తదానంతో నిల్వ సామర్ధ్యానికి మించి వస్తున్నప్పుడు హైదరాబాద్ లో ఉస్మానియా, నిమ్స్ తదితర ప్రభుత్వాసుపత్రులకు రక్త నిల్వవలను మళ్లిస్తున్నారు. అత్యధిక రక్తదాతలతో ప్రతి మూడు నెలలకు ఓసారి చిరంజీవి సమావేశమవుతున్నారు. ఎన్నోసార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు ‘బెస్ట్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ అవార్డు’ వచ్చింది. తమిళనాడులో హీరో సూర్య చేసే సేవా కార్యక్రమాలకూ ఆదర్శమైంది. కుత్సిత మనస్తత్వంతో విమర్శలు చేసిన వారికి కోర్టు తీర్పులతోనూ చిరంజీవి బ్లడ్ బ్యాంకు గొప్పదనం తెలిసింది. నేటి జాతీయ రక్తదాతల దినోత్సవం.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కు 27ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రక్తదాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ మహత్కార్యానికి వెన్నెముకగా నిలుస్తున్న చిరంజీవికి మనఃపూర్వక అభినందనలు తెలియజేయాల్సిందే.

సినిమా

Bala Krishna: మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..

Bala Krishna: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందా..? ఇండస్ట్రీ నుంచి అవుననే సంకేతాలే వస్తున్నాయి. త్వరలోనే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్....

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

రాజకీయం

పయ్యావుల ప్రశ్నలతో మండలిలో బొత్సకు ఇబ్బంది

అమరావతి: రాష్ట్ర బడ్జెట్‌పై శాసనమండలిలో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ముఖ్యంగా రైతులకు గిట్టుబాటు ధర, రాష్ట్ర...

విధ్వంస పాలన తర్వాత దక్షతతో ముందుకు: పవన్ కళ్యాణ్

అమరావతి: గత ప్రభుత్వం విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన పాలన సాగిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శాసనసభలో ద్రవ్య...

అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, వీఏవోలతో చర్చకు సిద్ధం: నారా లోకేష్

అమరావతి: అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, వీఏవోల సమస్యలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేయాల్సిన అవసరం...

7–12 తరగతుల బాలికలకు ఉచిత శానిటరీ న్యాప్‌కిన్‌లు: లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం: నారా లోకేష్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్ తయారీ రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్...

ఎక్కువ చదివినవి

అనకాపల్లిలో రూ.2,300 కోట్ల బ్లూ జెట్ ప్లాంట్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో మరో భారీ ఔషధ తయారీ పరిశ్రమకు నాంది పడింది. అచ్యుతాపురం–రాంబిల్లి మండలాల పరిధిలోని సీతపాలెం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేట్...

చంద్ర గ్రహణం 2026: మీ రాశిపై ప్రభావం ఎంత? ఏ రంగు బట్టలు మంచివి?

మార్చి 3, 2026 సాయంత్రం జరగబోయే చంద్ర గ్రహణం అనేక రాశులపై ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చంద్ర గ్రహణం సాధారణంగా మన భావోద్వేగాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు. ఏజీఎస్ సినిమాస్ గ్రూప్ యజమాని కల్పాత్తి...

ప్రోటోకాల్ పక్కన పెట్టి బాధితుల వద్దకు చంద్రబాబు

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజయనగరం నుంచి నేరుగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే ఆయన పర్యటన...

విరోష్ సేవా సందేశం: దేశవ్యాప్తంగా దేవాలయాల్లో అన్నదానం, స్వీట్స్ పంపిణీ

వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దేశ ప్రజల ఆశీస్సులకు కృతజ్ఞతగా విరోష్ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ మరియు ప్రముఖ నటి రష్మిక  మందన్న జంట తమ వివాహం...