మంత్రి లోకేష్ చొరవతో విద్యాశాఖ లో సంస్కరణలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,093FansLike
57,764FollowersFollow

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యాశాఖలో ఆయన చేపడుతున్న సంస్కరణలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య, టెక్నాలజీపై పట్టు లాంటివి పెంపొందించేందుకు తాజాగా మరోసారి కీలక సంస్కరణలు చేపట్టారు. ఇందులో చూసుకుంటే 9, 10 తరగతి స్టూడెంట్లకు ఏఐ తో పాటు కోడింగ్ లాంటి వాటిపై ప్రత్యేక కోర్సులు అందించబోతున్నారు. ఇందుకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ను కూడా రెడీ చేశారు. విద్యార్థులకు టెక్నాలజీపై పట్టు పెంచుతూనే లింగ సమానత్వం గురించి కూడా క్లాసులు చెప్పించబోతున్నారు.

ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సహకారంతో నైతికత, రాజ్యాంగ విలువలు, లింగ సమానత్వం లాంటి అంశాల మీద అవగాహన కల్పించబోతున్నారు. మరీ ముఖ్యంగా ప్రతి శనివారం నో బ్యాగ్ డేను నిర్వహిస్తారు. అంటే ఆ రోజు పుస్తకాల సంచులు, బ్యాగులు తీసుకురావాల్సిన అవసరం లేదు. దాంతో పాటు తొమ్మిదో తరగతి విద్యార్థులకు మార్చి 15 నాటికి ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించి ఆ వెంటనే టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన బ్రిడ్జి కోర్సులను స్టార్ట్ చేస్తారు. నవంబర్ నెల వచ్చే నాటికి సిలబస్ ను పూర్తి చేసి డిసెంబరు 5 నుంచి వంద యాక్షన్ ప్లాన్ అమలు చేస్తారు.

ప్రీ ఫైనల్‌ ఫిబ్రవరి 9 నుంచి 19 దాకా గ్రాండ్‌ టెస్ట్‌ మార్చి 2 నుంచి 12వ తేదీ దాకా నిర్వహిస్తారు. టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఉంటాయి. ఆ లోపు విద్యార్థులకు సబ్జెక్టు మీద పూర్తి అవగాహన రావడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్స్ రాయగలుగుతారు. వీరితో పాటు అన్ని తరగతుల్లో వెనకబడిన విద్యార్థులపై స్పెషల్ ఫోకస్ పెడుతారు. ఆన్ లైన్, ఆఫ్‌ లైన్ విధానంలో హైబ్రిడ్ లెర్నింగ్ నిర్వహిస్తారు. ఫార్మాటివ్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అలాగే ఇంగ్లిష్ భాష స్కిల్స్ ను కూడా పెంపొందిస్తారు. దీని కోసం మిషన్‌ ఇంగ్లిష్‌ ఫ్లూయన్సీ కార్యక్రమం నిర్వహిస్తారు.

ఇవే కాకుండా స్టూడెంట్స్ కు అవసరమైన APPSC, UPSC, బ్యాంకింగ్, ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మీద స్పెషల్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించి వారికి అవగాహనతో పాటు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇటు చదువును బిల్డ్ చేస్తూనే అటు హెల్త్ పై శ్రద్ధ తీసుకుంటారు. మెంటల్ హెల్త్ తో పాటు ఫిజికల్ హెల్త్ కు సంబంధించిన స్పెషల్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తారు. ఇవన్నీ మంత్రి నారా లోకేష్ చొరవతోనే జరుగుతున్నాయంటున్నారు. ఆయన స్పెషల్ గా స్టూడెంట్స్ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని వారికి ఏమేం కావాలనేది ఈ షెడ్యూల్ లో పొందుపరిచారు.

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“సిద్ధాంతాలే బలం… కార్యకర్తలే శక్తి”: లోకేష్ సందేశం

మంగళగిరిలో జరిగిన టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జిల శిక్షణ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ కీలక సూచనలు చేశారు. “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు....

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

ఎక్కువ చదివినవి

చెన్నకేశవరెడ్డి గెటప్‌లో కిరణ్ అబ్బవరం.. మాస్ పల్స్ బాగానే పట్టాడుగా!

తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కిరణ్ అబ్బవరం చేసిన ఎంట్రీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి  గెటప్‌లో ఆయన కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి. డిజిటల్ యుగంలో సినిమా రిలీజ్ కు...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో పాటు మరో ముగ్గురు స్టార్ హీరోయిన్లు...

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న సినిమా

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు ప్రధాన...