Switch to English

స్టూడెంట్స్ లో మార్పు కోసం గుంజీలు తీసిన హెచ్ ఎం.. అభినందించిన లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,946FansLike
57,764FollowersFollow

ఏపీ విద్యాశాఖలో మార్పుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులను కొట్టడం ద్వారా కాకుండా బుద్ధులు నేర్పించడం ద్వారా మార్చాలనేది విద్యాశాఖ ముఖ్య ఉద్దేశం. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయం పట్ల కొంత సీరియస్ గానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే విజయనగరం(డి) పెంట జడ్పీహెచ్ ఎస్ హెచ్ ఎం రమణ చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. తాము అన్ని విధాలుగా విద్యా బుద్ధులు నేర్పిస్తున్నామని, అన్ని వసతులు కల్పిస్తున్నా సరే స్టూడెంట్లలో మార్పులు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రౌండ్ లో స్టూడెంట్స్ ను నిలబెట్టి తన ఆవేదన వెలిబుచ్చారు. ‘మీ కోసం మేం ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం. కానీ మీలో నేర్చుకోవాలనే తపన రావట్లేదు. రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ లాంటివి రావట్లేదు. ఇంక మేమేం చేయాలి. మా తప్పు ఏమైనా ఉంటే క్షమించండి’ అంటూ గుంజీలు తీశారు. నేలపై పడుకుని క్షమించమని కోరారు. దీంతో విద్యార్థులంతా సార్ వద్దు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇది చూసిన మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. హెచ్ ఎం రమణను అభినందించారు.

‘రమణ గారు మీరు చేసిన పని నా మనసును కదిలించింది. విద్యార్థుల్లో మార్పులు తీసుకువచ్చేందుకు మనం ఇలాంటి సున్నితమైన విధానాలను ఎంచుకోవచ్చు. మనమందరం కలిసి స్టూడెంట్లలో మార్పును తీసుకొద్దాం. గవర్నమెంట్ స్కూల్స్ ను ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా తీర్చిదిద్దుదాం’ అంటూ రాసుకొచ్చారు. లోకేష్ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. స్టూడెంట్లను కొట్టడం, బెదిరించడం ద్వారా మార్పు సాధించలేమని.. వారిని మన దారిలోకి తీసుకువచ్చి మార్చుకోవాలనేది మంత్రి లోకేష్ ఉద్దేశంగా కనపడుతోందంటూ కామెంట్లు పెడుతున్నారు.

అదే సమయంలో స్టూడెంట్ల కోసం అంతగా ఆరాటపడుతున్న ఆ హెచ్ ఎంను కూడా అభినందిస్తున్నారు నెటిజన్లు. ఏపీలో గవర్నమెంట్ స్టూడెంట్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా వసతులు కల్పిస్తోంది. నాణ్యమైన ఆహారం, బట్టలు, విద్య అందించడమే లక్ష్యంగా భారీగా నిధులు కూడా కేటాయించింది.

సినిమా

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను...

అఖండ 2 రిలీజ్ వాయిదా – కొత్త తేదీ త్వరలో: నిర్మాతల...

అఖండ 2 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాతలు నిన్న రాత్రి లేట్‌గా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. సినిమా విడుదల కోసం టీమ్...

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

రాజకీయం

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రెస్ మీట్.! ఇచ్చట గాడిదలు కాయబడును.!

‘..క్కలో వేసెయ్యాలి’.. అంటూ, ప్రెస్ మీట్‌లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోరు జారారు.! అంతే కాదు, చీటింగ్ కేసు...

ఎట్టకేలకు.. రెండవ వివాహం చేసుకున్న సమంత!

దీర్ఘకాలంగా ఊహాగానాల మధ్య ఉన్న నటీమణి సమంత రూత్ ప్రభు  చివరకు తన రెండవ వివాహం పూర్తి చేసుకున్నారు. దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఇషా యోగ...

అఖండ 2 రిలీజ్ వాయిదా – కొత్త తేదీ త్వరలో: నిర్మాతల నుంచి అప్ డేట్

అఖండ 2 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాతలు నిన్న రాత్రి లేట్‌గా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. సినిమా విడుదల కోసం టీమ్ తమ వంతు ప్రయత్నం అంతా చేసినప్పటికీ,...

నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌కు 14 రోజుల రిమాండ్

ఇటీవల వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం కేసులో కీలక నిందితులుగా ఉన్న జోగి బ్రదర్స్—జోగి రమేష్, జోగి రాము—మళ్లీ వార్తల్లో నిలిచారు. నకిలీ మద్యం తయారీ, రవాణా, పంపిణీ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో...

యధార్థ సంఘటనల ఆధారంగా “విధాత”.. త్వరలో.

విధాత సినిమా తొలి కాపీ సిద్ధమైంది. Abc ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మణికంఠ రాజేంద్ర బాబు దర్శకత్వం వహించగా, నిర్మాతగా అప్పిని పల్లె భాస్కరాచారి పనిచేశారు. యదార్థ సంఘటన ఆధారంగా...