Switch to English

పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలి : నారా లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,799FansLike
57,764FollowersFollow

పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలని వారిలో చైతన్యం కలిగించేందుకు మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంద్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో ఎకో పార్క్ లో స్వచ్చాంద్ర కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు. పార్క్ లో చెత్తను స్వయంగా శుభ్రం చేసి చెత్తకుండీలో వేశారు లోకేష్.

స్వచ్చాంద్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుడు ఎమ్ నాగార్జునతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఊరు, పనిచేస్తున్న స్థలం గురించి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పారిశుద్ధ్య నిర్వహణకు కావాల్సిన సామాగ్రి ఎలా ఉందని.. చెత్తకుండీలు ఉన్నాయా అని అడిగారు లోకేష్. ఎకో పార్క్ లో ఏం చేస్తే ఇంకా బాగుంటుందని అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు నిద్రలోకి వెళ్లాక పారిశుద్ధ కార్మికులు పరిసరాలను శుభ్రం చేస్తారని నారా లోకేష్ ప్రశంసించారు. మంగళగిరి ఎకో పార్క్ బాగుందని.. మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్. పారిశుద్ధ్యం, పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పులు తీసుకు రావాలని అన్నారు.

కూటమి ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్చాంధ్ర కార్యక్రమం ప్రవేశ పెట్టింది. స్వచ్చతలో మంగళగిరిని ఆదర్శ కార్పోరేషన్ గా తీర్చిదిద్దుతామని అన్నారు లోకేష్. పరిసరాలను శుభ్రంగా ఉంచే విషయంలో ప్రజలకు కూడా బాధ్యత పెడితే పారిశుద్ధ్య కార్మికుల కష్టాలు తెలుస్తాయని అన్నారు. మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ, అండర్ వాటర్, గ్యాస్, పవర్ అందుబాటులోకి వస్తే సమస్యలు తీరుతాయని అన్నారు నారా లోకేష్. పారిశుద్ధ్య నిర్వహణలో మంగళగిరిని నెం.1 స్థానంలో నిలబెడతామని అన్నారు.

అనంతరం పారిశుద్ధ్య కార్మికుడు నాగార్జునను మంత్రి లోకేష్ శాలువాతో సత్కరించారు. ఎకో పార్క్ లో వాకింగ్ చేసే మంగళగిరి వాసులకు సొంతంగా 5 లక్షలతో ఉచిత ప్రవేశం కల్పించారు నారా లోకేష్. అందుకు నేచర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సినిమా

సమంతకి ఫ్యాన్స్ రిక్వెస్ట్.. ఏమనో తెలుసా..?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా దూసుకెళ్లాలని చూస్తుంది. అక్కడ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ చేసి హిట్ అందుకున్న...

రెట్రో కోసం రౌడీ వస్తున్నాడు..!

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన రెట్రో సినిమా మే 1న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్...

“పవన్ సార్.. మీరు వచ్చాక మా సమస్యలు తీరాయ్”

"మీరు వచ్చాక ఇళ్ల పట్టాలు ఇప్పించి నాలుగు దశాబ్దాల మా కల నెరవేర్చారు సార్. మీకు చెప్పగానే మా కాలనీకి కుళాయి వచ్చింది. విద్యుత్తు సరఫరా...

సూపర్ హిట్ SVCC బ్యానర్ లో మాచో స్టార్ గోపీచంద్ సినిమా..!

మాచో స్టార్ గోపీచంద్ సక్సెస్ ఫుల్ బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో సినిమా చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో...

ఈ అభిమానం ఎగ్జైట్ చేస్తుంది : విజయ్ దేవరకొండ

యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. తన సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరిస్తున్న విజయ్ దేవరకొండ రౌడీ అనే...

రాజకీయం

అమరావతికి ప్రధాని ఇంకోస్సారి.! ఈసారి చాలా చాలా ప్రత్యేకం.!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగానే, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది గతంలో. దేశంలోని పలు ప్రముఖ నదుల నుంచి నదీ జలాల్ని తీసుకొచ్చారు.. పుణ్య భూమిగా పిలవబడే...

పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌తో వర్మ.! ఆల్ సెట్ అయినట్లేనా.?

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన క్యాడర్‌కీ, టీడీపీ క్యాడర్‌కీ కొంత గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికంగా వైసీపీ క్యాడర్ వ్యూహాత్మకంగా టీడీపీ - జనసేన మధ్య పుల్లలు పెడుతోంది. చిన్న చిన్న విషయాలు,...

వైఎస్ జగన్ ‘2.0’ ఇంకో డిజాస్టర్.!

అధికారం కోల్పోయాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడచిన పది నెలల్లో ఏం చేసింది.? ప్రజల తరఫున ఏమైనా ప్రజా ఉద్యమాల్లో కనిపించిందా.? ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టిందా.? ప్రతిపక్ష నేత.. అనే హోదా కావాలనుకుంటున్న...

కూలీలు కాదు, శ్రామికులు.! అందరి మనసుల్ని గెలుచుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం...

పహల్గామ్ ఘటన: పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్ తప్పదా.?

పాకిస్తాన్‌ పౌరుల్ని దేశం నుంచి వెళ్ళగొడుతూ భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిిస్తాన్ నీటి అవసరాల్ని తీర్చే నదీ ఒప్పందాల్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. ఇంతేనా.? ఇంకా ముందు ముందు...

ఎక్కువ చదివినవి

వైఎస్ జగన్ ‘2.0’ ఇంకో డిజాస్టర్.!

అధికారం కోల్పోయాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడచిన పది నెలల్లో ఏం చేసింది.? ప్రజల తరఫున ఏమైనా ప్రజా ఉద్యమాల్లో కనిపించిందా.? ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టిందా.? ప్రతిపక్ష నేత.. అనే హోదా కావాలనుకుంటున్న...

ఒకే నెలలో నాలుగు సినిమాలు రీ రిలీజ్.. మహేశ్ ఫ్యాన్స్ పై భారం..

ఇప్పుడు ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. సాధారణంగా కొత్త సినిమాలను చూడటమే ఎక్కువ. అలాంటి కొన్ని వందల సార్లు టీవీల్లో వచ్చిన సినిమాలను తీసుకొచ్చి థియేటర్లలో రిలీజ్ చేసినా వాటిని...

జనసేన సభ్యత్వంతో, జనసేన ‘కుటుంబం’లోకి.!

రాజకీయ పార్టీలు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయడం కొత్తేమీ కాదు. కొన్ని రాజకీయ పార్టీలకు సభ్యత్వంతో పని వుండదు. అలాంటి పార్టీలూ వున్నాయి.. అవి, అధికారంలోకి వచ్చేసి, అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితుల్లో వుండడమూ...

మహేష్ బాబుకు ఈడీ సమన్లు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ED) నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు...

ఏపీ లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది

ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్( Mega DSC Notification -2025) పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. తాము అధికారంలోకి రాగానే ఖాళీగా...