ఇప్పుడిక అధికారికం.! 2023 జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. మొత్తం నాలుగు వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర జరుగుతుందట. రోజుకి పది కిలోమీటర్ల చొప్పున, నాలుగు వందల రోజులపాటు ఈ పాదయాత్ర నిర్వహిస్తానని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.
తెలుగు నేలకి రాజకీయ నాయకుల పాదయాత్రలు కొత్తేమీ కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్, వైఎస్ షర్మిల.. ఇలా సుదీర్ఘ పాదయాత్రలు చేసిన నాయకులకు కొదవేమీ లేదు. అందులో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలకు పాదయాత్రలు కలిసొచ్చాయ్.
ఫాఫం వైఎస్ షర్మిల మాత్రం, అంత కష్టపడ్డా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలస వెళ్ళిపోవాల్సి వచ్చింది. అన్నగారు ‘వాడుకుని వదిలేశారు’ అంటూ ఈ వ్యవహారంపై చాలా విమర్శలు వస్తుంటాయనుకోండి.. అది వేరే సంగతి.
నిజానికి, ఓ మహిళ సుదీర్ఘ పాదయాత్ర చేయడమంటే చిన్న విషయం కాదు. ఈ విషయంలో షర్మిలకు సాటి ఇంకెవరూ రారు. ఇంకోసారి షర్మిల పాదయాత్ర చేస్తున్నారు.. అదీ తెలంగాణలో.
నారా లోకేష్ పాదయాత్ర విషయానికొస్తే, గతంలో పరిస్థితులు వేరు.. ఇప్పుడు రాజకీయాల్లో మారిన పరిస్థితులు వేరు. రాజకీయ నాయకులు అడుగు తీసి అడుగెయ్యాలంటే అధికారంలో వున్నవారు నానా రకాల ఆంక్షలూ పెడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో, రాష్ట్రంలో రాజకీయ నాయకులకు, సామాన్యులకు స్వేచ్ఛ అనేది లేకుండా పోయిందన్నది నిర్వివాదాంశం.
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్.. ఇలా ఏ రాజకీయ నాయకులు ఎక్కడికి వెళ్ళినా, వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. పార్టీల కార్యాలయాలపైకి నిర్లజ్జగా దూసుకెళుతున్నాయి వైసీపీ మూకలు. ఏమన్నా అంటే, ‘బీపీ వస్తుంది మా కార్యకర్తలకి’ అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి సెలవిస్తారాయె.
మరి, నారా లోకేష్ పాదయాత్ర ఎలా సాగుతుంది.? వైసీపీ మూకల నుంచి లోకేష్ పాదయాత్రకు రక్షణ ఎలా.? ఐడీ కార్డులు చూపించి, ప్రత్యేక అనుమతులు తీసుకుని లోకేష్, ఆయన వెంట టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్ర చేయాల్సి వస్తుందా.? ఈలోగా వైసీపీ కార్యకర్తలకు బీపీలు రాకుండా వుంటాయా.? వేచి చూడాల్సిందే.
458186 488145Dead composed topic matter, thanks for data . 105167