నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,072FansLike
57,764FollowersFollow

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రెండు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమం మొత్తం రాజకీయ చర్చలకు దూరంగా, కుటుంబ సమ్మేళనం తరహాలో ఉల్లాసంగా సాగింది.

విందుకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని నారా లోకేష్ సాదరంగా ఆహ్వానిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు వచ్చిన చిన్నారులతో సరదాగా మాట్లాడి, బాగా చదువుకుని జీవితంలో ఎదగాలని సూచించారు. ఆత్మీయ సంభాషణలతో అక్కడ నవ్వులు పూశాయి. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు నారా లోకేష్ స్వయంగా భోజన ప్లేట్లు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఈ సందర్భంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం లోకేష్ చేస్తున్న కృషిని ప్రజాప్రతినిధులు అభినందించారు. ముఖ్యంగా విశాఖకు గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థను తీసుకురావడంలో చేసిన ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి గుర్తుగా నేతలు అందించిన ఫోటో ఫ్రేమ్‌లో “వైజాగ్” అనే పదంలో ‘జీ’ అక్షరాన్ని గూగుల్ లోగో తరహాలో రూపొందించి అందజేశారు. ఇది కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

విందు సందర్భంగా నియోజకవర్గాల అభివృద్ధి, స్థానిక సమస్యలపై ప్రజాప్రతినిధులు సిద్ధం చేసిన గ్రీవెన్స్ స్టేటస్ రిపోర్టులను నారా లోకేష్ వారికి అందజేశారు. అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లే దిశగా సమన్వయం కొనసాగించాలని ఆయన సూచించారు. కార్యక్రమానికి హాజరైన మహిళలకు తన నియోజకవర్గంలోని చేనేత కళాకారులు నేసిన మంగళగిరి పట్టుచీరలను చిరు కానుకగా అందజేశారు.

ఈ విందు సమావేశానికి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ముతుకుమిల్లి భరత్, ఎమ్మెల్యేలు పీజీవీఆర్ నాయుడు (గణబాబు – విశాఖ వెస్ట్), గంటా శ్రీనివాసరావు (భీమిలి), వెలగపూడి రామకృష్ణబాబు (విశాఖ ఈస్ట్), వంశీకృష్ణ శ్రీనివాస్ (విశాఖ సౌత్), విష్ణుకుమార్ రాజు (విశాఖ నార్త్), పల్లా శ్రీనివాసరావు (గాజువాక), కోళ్ల లలితకుమారి (శృంగవరపుకోట), ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు హాజరయ్యారు. అరకు పార్లమెంట్ పరిధి నుంచి మంత్రి గుమ్మడి సంధ్యారాణి (సాలూరు), తోయక జగదీశ్వరి (కురుపాం), బోనెల విజయచంద్ర (పార్వతీపురం), నిమ్మక జయకృష్ణ (పాలకొండ), ఎం శిరీషాదేవి (రంపచోడవరం) కుటుంబసభ్యులతో కలిసి ఈ ఆత్మీయ విందులో పాల్గొన్నారు.

రాజకీయ చర్చలకు దూరంగా, కుటుంబ సభ్యులతో కలిసి జరిగిన ఈ సమావేశం ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధుల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచిందని పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంశాలపై పరస్పరం చర్చించుకుంటూ, అనౌపచారిక వాతావరణంలో జరిగిన ఈ సమ్మేళనం ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది.

సినిమా

“ఫస్ట్ హాఫ్ లాక్… అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ట్!”

దర్శకుడు Anil Ravipudi తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథనం దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్...

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న...

రొటీన్ కాదట… ‘పెద్ది’ క్లైమాక్స్ షాక్ ఇవ్వనుందా?”

పెద్ది సినిమా గురించి వస్తున్న తాజా అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. దర్శకుడు Buchi Babu Sana ఈ చిత్రానికి సాధారణ కమర్షియల్ ముగింపుకంటే...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

“ఫస్ట్ హాఫ్ లాక్… అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ట్!”

దర్శకుడు Anil Ravipudi తన తదుపరి సినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్‌ను పూర్తిగా లాక్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథనం దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఫస్ట్...

“త్రివిక్రమ్ సినిమాలో కొత్త విలన్..? వెంకటేష్ మూవీకి ఆసక్తికర ట్విస్ట్!”

ఉదయ్‌బీర్ సందు తాజాగా ‘ధురంధర్’ సినిమాలో పిందా పాత్రతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయనకు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన అవకాశం దక్కే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

Akira Nandan: అకీరా ఎంట్రీకి టైమ్ వచ్చిందా?

Akira Nandan: మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పేరు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది — అకీరా నందన్. పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్,...

అడివి శేష్ కొత్త గేమ్ ప్లాన్.. రెండు ప్రాజెక్ట్స్‌తో సర్‌ప్రైజ్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక కథల ఎంపికతో గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ (Adivi Sesh), మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, శేష్ రెండు...