“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,455FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక అభ్యసన సామర్థ్యాలను పెంచడమే అసలైన సంస్కరణ అని భావించిన లోకేష్.. రాష్ట్ర విద్యా వ్యవస్థలో మూలస్థాయి మార్పులకు శ్రీకారం చుట్టారు. నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (NAS), ASER నివేదికల్లో బయటపడిన లోపాలను గుర్తించి, వాటి ఆధారంగా ప్రాథమిక విద్యను బలోపేతం చేసే చర్యలను అమలు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 38,391 ప్రాథమిక పాఠశాలల్లో దేశంలోనే తొలిసారిగా “గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ” (G-FLN) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. చిన్నారులు ఒత్తిడితో కాకుండా ఆటపాటలతో, సరదాగా చదువు నేర్చుకునేలా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ విధానాన్ని తీసుకువచ్చారు. చిత్రాలు, ఆటలు, కథలు, ఫ్లాష్ కార్డులు, బాలా ఫీచర్స్ ద్వారా తెలుగు, ఇంగ్లీష్, గణితం బోధిస్తున్నారు. “జ్ఞానజ్యోతి”, “జ్ఞానప్రకాశ్” వంటి మాడ్యూల్స్ ద్వారా ప్రతి అక్షరాన్ని అనుభూతి చెందుతూ నేర్చుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.

విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి, వారి స్థాయికి అనుగుణంగా ప్రత్యేక పాఠ్య ప్రణాళికలు రూపొందించారు. రెగ్యులర్ క్లాసుల తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి 3.30 గంటల వరకు రెమెడియల్ సెషన్లు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులకు అదనపు బోధన అందిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసనాన్ని మరింత సులభతరం చేసేందుకు భారీ స్థాయిలో బోధనాభ్యసన సామగ్రిని పంపిణీ చేశారు. “జాదూయ్ పిటారా” పేరుతో 62 రకాల కృత్యాధార వస్తువులతో కూడిన ప్రత్యేక లెర్నింగ్ కిట్లు సుమారు 12 వేల పాఠశాలలకు అందించారు. మిగతా పాఠశాలలకు FLN లెర్నింగ్ కిట్లు పంపిణీ చేశారు. తరగతి గదులను ప్రింట్ రిచ్ వాతావరణంగా మార్చేందుకు వర్ణమాల చార్టులు, గుణింతాలు, సంఖ్యలు, వర్డ్ వాల్స్, ఫ్లాష్ కార్డులు, రీడింగ్ కార్నర్లు ఏర్పాటు చేశారు.

“Building as a Learning Aid (BaLA)” విధానంలో పాఠశాల భవనాలనే బోధన సాధనాలుగా మార్చారు. గోడలపై సైన్స్ చిత్రాలు, స్థానిక మ్యాపులు, నేలపై ఇంటరాక్టివ్ గేమ్స్ ద్వారా పిల్లలు చూసి నేర్చుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థుల్లో కూడా ఆసక్తి పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

చైల్డ్ ఫ్రెండ్లీ ఫర్నిచర్, అవుట్‌డోర్ ప్లే మెటీరియల్, 75 రోజుల యాక్షన్ ప్లాన్ బుక్స్, స్థాయిల వారీగా స్ట్రీమ్, మౌంటైన్, స్కై లెవెల్ వర్క్‌బుక్స్ అందించారు. ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక హ్యాండ్‌బుక్స్ కూడా సిద్ధం చేశారు. తరగతి గదుల్లో స్మార్ట్ టీవీలు, IFP ప్యానెల్స్, QR కోడ్ ఆధారిత డిజిటల్ పాఠాలు, ORF యాప్ వంటి సాంకేతిక వనరులను వినియోగిస్తున్నారు.

3, 4, 5 తరగతుల విద్యార్థుల కోసం “Teaching at the Right Level (TaRL)” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పిల్లల స్థాయికి తగ్గట్టే బోధన అందిస్తూ, వారి బలహీనతలను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

ఇక 9వ తరగతి విద్యార్థులను 10వ తరగతికి సిద్ధం చేసేందుకు “రెడీనెస్ ప్రోగ్రామ్”ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఒత్తిడి లేకుండా స్నేహపూర్వక విద్యా వాతావరణంలో విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు.

10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా “100 డేస్ యాక్షన్ ప్లాన్” అమలు చేశారు. 46 స్లిప్ టెస్టులు నిర్వహించి, వాటి ఫలితాలను “లీప్” యాప్ ద్వారా విశ్లేషించారు. విద్యార్థులను “షైనింగ్ స్టార్స్”, “రైజింగ్ స్టార్స్”గా విభజించి ప్రత్యేక బోధన అందించారు. మోడల్ పేపర్లు, ప్రశ్నాబ్యాంకులు, ద్విభాషా ప్రశ్నపత్రాలు అందించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడింది. వెనుకబడిన విద్యార్థుల కోసం 30 రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం భవనాలు, మౌలిక వసతులు మాత్రమే కాకుండా, విద్యార్థులలో నిజమైన అభ్యసన సామర్థ్యాలు పెంపొందించే దిశగా వ్యవస్థను మార్చడమే లక్ష్యంగా నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. పునాది దశ నుంచే సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారంపై దృష్టి పెట్టడం వల్ల ప్రభుత్వ విద్యలో క్రమంగా మార్పులు కనిపిస్తున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సినిమా

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు...

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రీషూట్స్..! ఏం జరుగుతుందో క్లారిటీ...

The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే చాలా భాగం తెరకెక్కిన సినిమా ఇంకా కొంత భాగం...

రాజకీయం

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులు తెచ్చిన చంద్రబాబు.. అమరావతిలో EY ఎంట్రీ!

అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఐటీ మరియు ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజన్‌కు మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్, ఐటీ సంస్థ Ernst &...

ఎక్కువ చదివినవి

కడప అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర..? పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు

కడపలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగం పెంచింది. అల్మాస్‌పేట సర్కిల్ పేరు మార్పు అంశాన్ని కేంద్రంగా చేసుకుని జరిగిన ఈ ఉద్రిక్తతల వెనుక రాజకీయ ప్రేరణ ఉందనే అనుమానాలు...

ఏపీలో టీవీకే పార్టీ పోటీ చేస్తుందా.? టీవీకేతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందా?

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నానాటికీ మరింత దిగజారిపోతోంది. గత కొన్నాళ్ళుగా వైసీపీ క్యాడర్ అంతా, తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పట్టించుకోవడం మానేసింది. వైఎస్ జగన్ ప్రస్తుతం విదేశీ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు దూరమవడం, ఓటీటీ ప్రభావం, హీరోల సినిమా...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి.. సింగిల్ స్క్రీన్...

వెంకటేష్ – కళ్యాణ్‌రామ్ సినిమాకు జివి ప్రకాష్ అదిరే ట్యూన్స్!

టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో దర్శకుడు Anil Ravipudi తెరకెక్కిస్తున్న వెంకటేష్ - కళ్యాణ్‌రామ్ మల్టీస్టారర్ ఒకటి. ఇటీవల Mana Sankara Vara Prasad Garu సినిమాతో భారీ...