2029లో మహిళలకు 33% సీట్లు.. మహానాడులో లోకేష్ సంచలన ప్రకటన

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,219FansLike
57,764FollowersFollow

మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ మహిళా రాజకీయ సాధికారతపై కీలక ప్రకటన చేశారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తుందని ప్రకటిస్తూ చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా టీడీపీ తమ స్థాయిలో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తుందని స్పష్టం చేశారు.

2029లో మహిళలకు 33% సీట్లు.. మహానాడులో లోకేష్ సంచలన ప్రకటన

మహానాడులో మాట్లాడుతూ మహిళలు కేవలం లబ్ధిదారులుగా కాకుండా నిర్ణయాలు తీసుకునే స్థాయికి రావాలని అన్నారు. భారత రాజకీయాల భవిష్యత్తు మహిళా నాయకత్వానిదేనని వ్యాఖ్యానించిన లోకేష్.. టీడీపీ మహిళా సాధికారతను నినాదంగా కాకుండా బాధ్యతగా భావిస్తోందన్నారు. మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసే సంస్కృతిని సమాజం నుంచి తొలగించాలని పిలుపునిచ్చారు.

మహానాడు హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించినప్పటికీ కార్యకర్తల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదని లోకేష్ పేర్కొన్నారు. ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా, హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్-11కి బ్యాటింగ్ తప్పదంటూ వైసీపీపై సెటైర్లు వేశారు. టీడీపీ మహానాడు ప్రతి కార్యకర్త గర్వంగా పాల్గొనే పసుపు పండుగ అని అభివర్ణించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను గుర్తుచేసిన లోకేష్.. సంక్షేమం, అభివృద్ధి, మహిళా హక్కుల విషయంలో ఆయన చూపిన దారినే టీడీపీ అనుసరిస్తోందన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. అలాగే చంద్రబాబు నాయకత్వాన్ని ప్రశంసిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా “సీబీఎన్” పేరు గౌరవాన్ని తెచ్చిందన్నారు. ఐటీ నుంచి ఏఐ వరకు, హైటెక్ సిటీ నుంచి క్వాంటమ్ వ్యాలీ వరకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విజన్ చంద్రబాబుదేనని చెప్పారు.

2029లో మహిళలకు 33% సీట్లు.. మహానాడులో లోకేష్ సంచలన ప్రకటన

2019 నుంచి 2024 వరకు టీడీపీ కార్యకర్తలు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని లోకేష్ అన్నారు. అరెస్టులు, కేసులు, దాడులు ఎదురైనా కార్యకర్తలు వెనక్కి తగ్గలేదన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి చారిత్రాత్మక విజయాన్ని అందించారని, 94 శాతం స్ట్రైక్ రేట్‌తో 164 సీట్లు సాధించడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించిన లోకేష్.. నాలుగు వేల పెన్షన్, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్, ఉచిత విద్యుత్, దీపం-2 వంటి పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పారు. అదే సమయంలో అభివృద్ధి విషయంలో కూడా రాష్ట్రం వేగంగా ముందుకు వెళ్తోందని, గూగుల్, ఫైటర్ జెట్ ప్రాజెక్టులు వంటి భారీ పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని తెలిపారు.

వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన లోకేష్.. “మాది గూగుల్.. మీది గొడ్డలి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. డీఎస్సీ, ఉద్యోగాల అంశాల్లో వైసీపీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇస్తూ.. “నీది టెన్త్ క్లాస్ పేపర్ కొట్టేసిన హిస్టరీ.. నాది స్టాన్‌ఫోర్డ్ హిస్టరీ” అంటూ జగన్‌పై విమర్శలు గుప్పించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ విజయమే లక్ష్యమని స్పష్టం చేసిన లోకేష్.. అహంకారానికి దూరంగా ఉండి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయికతో ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని ప్రాజెక్టులు సాధ్యమయ్యాయని తెలిపారు.

  2029లో మహిళలకు 33% సీట్లు.. మహానాడులో లోకేష్ సంచలన ప్రకటన

సినిమా

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు,...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

రాజకీయం

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

ఎక్కువ చదివినవి

కోదాడలో గ్యాస్ పేలుడు కలకలం.. అప్రమత్తమైన పోలీసులు

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆదివారం గ్యాస్ పేలుడు సంభవించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగా థియేటర్ సమీపంలోని సందులో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఆ ప్రాంత ప్రజలు...

శ్రీలీల హిందీ సినిమాకు బ్రేకులు.. రిలీజ్ ఎప్పుడో ఇంకా క్లారిటీ లేదు

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా కనిపించిన శ్రీలీలకు ఇటీవల కొత్త ప్రాజెక్టులు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ హీరోగా, దర్శకుడు అనురాగ్ బసు...

ప్రకృతే శాశ్వత సంపద: 18 నగర వనాలను ప్రారంభించిన పవన్ కళ్యాణ్

ప్రకృతితో కలిసి సాధించే అభివృద్ధే శాశ్వతమని, భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి Pawan Kalyan అన్నారు....

Chiranjeevi: చిరంజీవిపై చెడు ప్రచారం..! విమర్శకులకు వి.ఎన్.ఆదిత్య క్లాస్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని యాంటీ ఫ్యానిజంతో పదేపదే తూలనాడతారు కొందరు యాంటీ ఫ్యాన్స్. నీకు నచ్చిన హీరోని అభిమానించుకునే క్రమంలో చిరంజీవిని దూషించడం అవివేకం. పరిస్థితుల ప్రభావంతో హీరో ఉదయ్ కిరణ్ ఈలోకం...

పులుల కోసం పవన్ కీలక భేటీ.. ఏపీకి రెండు ఆడ పులులు!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం ముంబైలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల పరస్పర...