ఐటీ సంస్థ సిస్కో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య నేడు ఎంవోయూ జరిగింది. ఐతే ఈ మీటింగ్ లో సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్ హోదాలో ఇప్పాల రవీంద్రా రెడ్డి పాల్గొన్నారు. ఇప్పాల రవీంద్రా రెడ్డి ఇంతకుముందు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో పాటుగా ఇతర టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో వల్గర్ పోస్టులు పెట్టారు. అతను లోకేష్ ని కలవడంపై టీడీపీ నేతలు సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
రవీంద్రా రెడ్డి పెట్టిన వల్గర్ పోస్టులు టీడీపీ నేతలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లోకేష్ ని కలిసేందుకు ఇతనికి ఎలా పర్మిషన్ ఇచ్చారని ఫైర్ అవుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ కూడా సీరియస్ అయ్యారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
లోకేష్ ఓఎస్డీ సిస్కోకు ఒక లెటర్ మెయిల్ చేశారు. సోషల్ మీడియాలో ఇప్పాల రవీంద్రా రెడ్డి తమ పార్టీ నేతలపై పెట్టిన పోస్టుల గురించి కూడా లెటర్ లో మెన్షన్ చేశారు. అంతేకాదు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సిస్కో చేసే ప్రాజెక్ట్ వ్యవహారాల్లో అతన్ని పక్కన పెట్టాలని కోరారు. తమ మెయిల్ కి వెంటనే సమాధానం ఇవ్వాలని అన్నారు.
