ప్రస్తుతం జనాలంతా .. జ్వరాలతో అల్లాడుతున్నారు. ప్రభుత్వం కూడా సరైన వసతులు కల్పిచడంతో విఫలం అయిందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ వర్షాకాలంలో ఎక్కువ మంది డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. సాధారణ జనాలే కాకుండా పలువురు సినీ ప్రముఖులు కూడా డెంగీ బారిన పడ్డట్టు తెలిసింది.
తాజగా టాలీవుడ్ కింగ్ నాగార్జున కు డెంగీ జ్వరం వచ్చినట్టు ఆయనే స్వయంగా తెలిపారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా డెంగీ జ్వరం నుండి కోలుకుంటున్నట్టు తెలిపారు. తాజాగా నాగార్జున ట్విట్టర్ లో స్పందిస్తూ తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని .. మురికి నీరు వల్ల దోమలు వ్యాప్తి చెందుతాయని, దానివల్ల అనారోగ్యం పాలవుతామని అన్నారు. అంతే కాదు ఈ జ్వరం నుండి కోలుకున్నా కూడా ఒళ్ళు నొప్పులు మాత్రం తీవ్రంగా ఉన్నాయన్నారు.
తన ఇంటితో పాటు అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాల్లో మురికి నీరు నిల్వకుండా చూడాలని చెప్పినట్టు నాగ్ పేర్కొన్నాడు. అలాగే ప్రతి ఒక్కరు మీ ఇంటి పరిసరాలలో మురుగు నీరు ఉండకుండా జాగ్రత్త పడండి అని చెబుతూ .. ఆ ట్విట్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేసాడు నాగ్. నాగ్ కు డెంగీ జ్వరం అని తెలియడంతో అక్కినేని ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు.
Also Read: నాగార్జునగారు, పునర్నవిగారు.. ఓ చిరిగిపోని ఇన్విటేషన్.!
