Switch to English

మే 22 తో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న స్పెషల్ లింకప్ ఏంటో తెలుసా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

నేటితో అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి చేసిన ‘మనం’ సినిమా ఆరేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మే 22 కీ, అక్కినేని కుటుంబానికీ ఎంతో అనుబంధం ఉందన్నారు కింగ్ నాగార్జున.

“నాన్నగారితో నేను, చైతు, అఖిల్ కలిసి నటించిన ‘మనం’ చిత్రం ప్రివ్యూ ను మే 22 రాత్రి ప్రసాద్ ఐమాక్స్ లో వేసినప్పుడు నాన్నగారితో బాగా అనుబంధం ఉన్న ఒక వ్యక్తి నా దగ్గిరకు వచ్చి మే 22 తేదీనే నాన్నగారు హీరోగా నటించిన తొలి చిత్రం ‘సీతారామ జననం’ లో నటించడానికి ఘంటసాల బలరామయ్య గారి ఆఫీస్ కి వెళ్ళారని చెప్పారు. అప్పుడే ఈ డేట్ కు ఉన్న ఇంపార్టెన్స్ గురించి నాకు తెలిసింది. మే 23న ‘మనం’ రిలీజ్ అయ్యింది. ఆ రోజు అందరూ ఫోన్ చేస్తూ నాకు ఈ సినిమా హిట్ తో పాటూ నా తొలి చిత్రం ‘విక్రమ్’ రిలీజ్ అయ్యి 28 ఏళ్ళు అయిందని చెప్పడం మొదలెట్టారు. నాన్నగారితో మేమంతా కలిసి నటించిన ‘మనం’, నేను నటించిన ఫస్ట్ పిక్చర్ ‘విక్రమ్’ ఒకే రోజు రిలీజ్ అవడం కూడా ప్లాన్ చేసింది కాదు. నాన్నగారు ఘంటసాల బలరామయ్య గారి ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న ప్రముఖ నటులు పెకేటి శివరాం గారు నాన్నగారిని ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకుని ఆఫీస్ లోకి తీసుకెళ్ళడమే కాకుండా షూటింగ్ ఫస్ట్ డే న ఫస్ట్ షాట్ తీసేటప్పుడు దగ్గిరుండి మేకప్ రూమ్ నుండి షూటింగ్ స్పాట్ కు తీసుకువచ్చారు. అదే విధంగా నా తొలి చిత్రం ‘విక్రమ్’ కి కూడా పేకేటి గారు ప్రత్యేకంగా వచ్చి ఫస్ట్ షాట్ తీసేటప్పుడు నన్ను మేకప్ రూమ్ నుండి షూటింగ్ స్పాట్ కి తీసుకొచ్చారు. విక్రమ్ ఓపెనింగ్ స్టిల్ లో కూడా నాన్నగారు, డైరెక్టర్ మధుసూదన రావు గారి మధ్య పేకేటి గారు ఉన్నారు. నాన్నగారి పిలుపు మేరకు ఆ రోజు విక్రమ్ ఓపెనింగ్ కి విచ్చేసిన దాసరి గారు నాకు ‘మజ్ను’ తో మంచి విజయాన్ని అందిస్తే, రాఘవేంద్రరావు గారు ‘అన్నమయ్య’ లాంటి మరిచిపోలేని గొప్ప చిత్రాన్ని ఇచ్చారు. ‘అన్నమయ్య’ కూడా మే 22 నే విడుదలై గొప్ప చరిత్ర సృష్టించింది. అందుకే మే 22 ఉదయం నుండే అందరూ ‘మనం’ గురించి, ‘అన్నమయ్య’ గురించి, ‘విక్రమ్’ గురించి నాకు ఫోన్లు చేస్తూ అభినందిస్తుంటారు. ఇలా ఆ డేట్ కు ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా మా నాన్నగారు సినీ పరిశ్రమ లోకి రావడానికి మద్రాసు మహానగరంలో అడుగు పెట్టిన రోజది. అందుకే ఆ డేట్ అంటే నాకు ఎంతో ఇష్టం. ‘విక్రమ్’ మే 23 న రిలీజ్ అయ్యింది. విక్రమ్ డైరెక్షన్ లో మేము తీసిన ‘మనం’ కూడా మే 23 న రిలీజ్ అయ్యింది. ఇదంతా ప్లాన్ చేసింది కాదు కానీ ఏదో అలా డిజైన్ చేసినట్లు జరిగింది. నాన్నగారు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 22 నే, 22, 23న సాధించిన విజయాలను అభినందిస్తూ ఫోన్లు వస్తుంటాయి. అందుకే మే 22వ తేదీ నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. విక్రమ్ తో ప్రారంభమైన నా నటజీవితం 34 ఏళ్ళు సక్సెస్ ఫుల్ గా పూర్తవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి కారకులైన ప్రేక్షకులకు, మా అక్కినేని అభిమానులకు, మా అభివృద్ధి కి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.” అన్నారు కింగ్ నాగార్జున

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...