కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అన్ని పరిశ్రమల మాదిరిగానే సినిమా పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం పడినది. సినిమా షూటింగ్స్ లో పాల్గొనే డైలీ వర్కర్స్ ప్రస్తుతం ఉపాది లేక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో మరో పని చేయలేక తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు పలువురు వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.
సినీ ప్రముఖుల్లో పలువురు తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి ఇంకా పీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు ఇస్తున్నారు. ఇంకొందరు టాలీవుడ్ సినీ కార్మికులకు విరాళంను ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినీ వర్కర్స్ కోసం కోటి రూపాయల ఆర్థిక సాయంను ప్రకటించాడు. కోటి విరాళం ప్రకటించిన చిరు ఆ మొత్తంను ఉపాది లేక ఆకలితో పస్తులు ఉంటున్న సినీ కార్మికులకు అందించబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు.
చిరంజీవి దారిలోనే పలువురు స్టార్స్ కూడా సినీ పరిశ్రమకు చెందిన కార్మికుల సహాయార్థం విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తాజాగా అక్కినేని నాగార్జున కూడా సినీ కార్మికుల కోసం కోటి రూపాయల ఆర్థిక సాయంను ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ తప్ప మరో దారి లేదు. ఇలాంటి సమయంలో నా సహ సినీ పరిశ్రమ కార్మికుల కోసం తనవంతు సాయంగా కోటి విరాళంను ప్రకటిస్తున్నాను అంటూ నాగార్జున ట్వీట్ చేశాడు. నాగార్జున మంచి మనసుపై పలువురు అభినందనలు గుప్పిస్తున్నారు.
#lockdown is a harsh reality and a necessity!!! Appreciating the response from my colleagues🙏I am Donating an amount of Rs 1 Crore for now as my bit for the well being of daily wages Film workers during this#Coronacrisis. May god bless us!! #StayHomeStaySafe
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 28, 2020
789624 462982You must participate in a contest for among the top blogs on the internet. I will recommend this site! 494273