శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం బొంతుపేట గ్రామానికి చెందిన చిన్నారి రెడ్డి దీపిక అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆమె పరిస్థితి తెలిసిన ఎమ్మెల్సీ, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు తక్షణమే వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించారు. అలాగే ప్రతి నెలా వైద్యానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని తెలిసిన ఆయన, ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
అలాగే మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన బంకూరి పోలి నాయుడు కూడా నాగబాబు ని కలిశారు. గతంలో జెడ్పీటీసీగా పోటీ చేసిన సమయంలో వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి పక్షవాతానికి గురయ్యానని ఆయన వివరించారు. దీనిపై స్పందించిన నాగబాబు, పోలి నాయుడు విద్యార్హతలకు తగ్గట్టు ఉద్యోగం కల్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
