జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ బలాన్ని పెంచేందుకు ప్రతి కార్యకర్తతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటామని తెలిపారు.
నాగబాబు గారు ఇకపై ప్రతీ నెల ఉత్తరాంధ్రలో జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిల్లో సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. మారుమూల గ్రామాల్లో ఉన్న కార్యకర్తలతో కూడా కలసి మాట్లాడి, వారి సూచనలు, సమస్యలు తెలుసుకుంటామన్నారు.
ఈ విధంగా కార్యకర్తలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం పార్టీకి మేలు చేస్తుందని నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, మాజీ మంత్రి పడాల అరుణ, జిల్లా సమన్వయకర్తలు పేడాడ రాంమోహన్, గేదెల చైతన్య, దాసరి రాజు, డాక్టర్ విశ్వక్షేన్, కణితి కిరణ్ కుమార్, బలగ ప్రవీణ్, పొగిరి సురేష్ బాబు, భీమిలి ఇంచార్జీ డాక్టర్ పంచకర్ల సందీప్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఈశ్వరరావు, దుర్యోధనరెడ్డి, కార్పొరేషన్ డైరెక్టర్లు గర్బాన సత్తిబాబు, లోల్ల రాజేష్, నిమ్మల నిబ్రం, డా. వేగులాడ దుర్గారావు, మండల అధ్యక్షులు, స్థానిక నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు.

