నేషనల్ క్రష్ రష్మిక మందన్న, యువ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి కలిసి ఈ సినిమాకు నిర్మాతలుగా పనిచేస్తున్నారు.
ఇక ఈ సినిమాలోని తొలి పాట ‘నదివే…’ కు సంబంధించిన అప్డేట్ను మేకర్స్ ఇచ్చారు. ఈ లిరికల్ సాంగ్ను జూలై 16న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ మెలొడీ సాంగ్కు సంగీతం అందించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
