కరోనా వ్యాప్తి నేపథ్యంలో జనాలు అంతా కూడా మాస్క్ ధరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సామాజిక దూరం మరియు మాస్క్లు మాత్రమే కరోనా నుండి దూరంగా ఉంచగలవు. వైరస్కు వ్యాక్సిన్ వచ్చేప్పటి వరకు జాగ్రత్తలు పాటించాలనే ఉద్దేశ్యంతో ప్రతిఒక్కరు కూడా మాస్క్లు ధరిస్తున్నారు. కాస్త డబ్బున్న వారు ఎన్ 95 మాస్క్లను వాడుతున్నాయి. అయితే కాస్త జాగ్రత్తగా వాటిని వాష్ చేయడం వల్ల రీ యూజ్కు అవకాశం ఉంటుంది. రెగ్యులర్ మాస్క్ల మాదిరిగా వాష్ చేస్తే వాటిని మళ్లీ వాడి ప్రయోజనం ఉండదు అంటున్నారు.
ఎన్ 95 మాస్క్లను రెగ్యులర్ బట్టల మాదిరిగా వాష్ చేయకూడదు. 70 నుండి 80 డిగ్రీల సెల్సియస్ ఉండే ఆవిరిలో కనీసం గంట పాట మాస్క్ను ఉంచినట్లయితే ఆ మాస్క్ ఏమాత్రం పాడు కాకుండా ఉండటంతో పాటు దానిపై ఏమైనా వైరస్ ఉన్నా కూడా పోతుంది. ముఖ్యంగా కరోనా వైరస్ లేకుండా మాస్క్ ను క్లీన్ చేయాలంటే ఆవిరిలో ఉంచాల్సిందిగా సూచిస్తున్నారు. అలా కాకుండా రెగ్యులర్గా అదే మాస్క్ను ధరించడం వల్ల ప్రయోజనం కంటే ఎక్కువగా నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.