స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్ తో నడుస్తూ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రానికి దాదాపు 100 కోట్ల దాకా షేర్ వచ్చింది. నిర్మాతలు ఈ చిత్రం ద్వారా భారీ లాభాలను మూటగట్టుకుంది.
అయినా కానీ ఈ సినిమాలో నటించిన వారికి ఫుల్ పేమెంట్స్ అందలేదని తెలుస్తోంది. ముఖ్యంగా మురళీ శర్మ ఈ సినిమా విషయంలో గుస్సాగా ఉన్నాడని సమాచారం. వివరాల్లోకి వెళితే మురళీ శర్మకు అందాల్సిన పేమెంట్ పూర్తిగా అందలేదని తెలుస్తోంది. మురళీ శర్మ సాధారణంగా డైలీ పేమెంట్ తీసుకున్నాడు. ముందు మాట్లాడుకున్న దాని ప్రకారం 50 రోజులకు కాల్ షీట్స్ ఇచ్చాడు.
అయితే తన కాల్ షీట్స్ ను 70 రోజులకు పెంచాల్సి వచ్చింది. గీతా ఆర్ట్స్, చినబాబు ఇద్దరూ పెద్ద నిర్మాతలే కావడంతో తర్వాత ఉద్దేశంతో మురళీ శర్మ ముందు షూటింగ్ పూర్తి చేసేసాడు. అయితే మిగిలిన 20 రోజుల కాల్ షీట్స్ కు సంబంధించిన పేమెంట్ మాత్రం అందలేదట. అడిగితే మాట దాటివేసినట్లు సమాచారం.
ఈ విషయంలో హర్ట్ అయిన మురళీ శర్మ అల వైకుంఠపురములో ఈవెంట్స్ అన్నిటికీ దూరంగా ఉంటూ వస్తున్నాడు. బ్లాక్ బస్టర్ విజయం సాధించిన చిత్రానికి ఇలా పేమెంట్ సరిగ్గా అందలేదన్న గోల ఏమిటో.
645181 238824I dugg some of you post as I thought they were very helpful handy 611026
324028 685615definitely like your web internet site but you want to check the spelling on several of your posts. Several of them are rife with spelling troubles and I find it quite troublesome to tell the truth nevertheless I will definitely come back once more. 207878