‘కేసీఆర్ తిని వదిలేసిన బొక్కలు తినే వారు కొందరు నా జాతకం బయట పడుతుందంటున్నారు.. దమ్ముంటే వచ్చి నా జాతకం బయట పెట్టండి. ఈ భూములు హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్నాయి. కేటీఆర్ స్నేహితుడు శ్రీధర్ పై విచారణ చేయాలి’ అని రేవంత్ డిమాండ్ చేశారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ నిజనిర్థారణ కమిటీ దేవరయాంజాల్లో పర్యటించింది. ఆలయ భూముల్లో టీఆర్ఎస్ సహా పలు పార్టీల ముఖ్య నేతలు ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘సర్వే నెంబర్ 212 నుంచి 218 వరకు 84 ఎకరాల దేవుడి భూములను టీఆర్ఎస్ నేతలు అమ్ముకున్నారు. కేసీఆర్ భాగస్వామి పత్రిక తెలంగాణ కార్యాలయాన్ని ఇక్కడ అక్రమంగా నిర్మించింది. కేసీఆర్ దగ్గరి బంధువు గండ్ర శ్రీనివాస్రావు శ్రీని డెవలపర్స్ పేరుతో ఇక్కడే వెంచర్ చేసి అమ్ముతున్నారు. 657 సర్వే నెంబర్లో మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాస్ ఫామ్హౌస్ నిర్మించుకున్నారు. మర్రి రాజశేఖర్రెడ్డి ఇక్కడ నుండే రాజకీయాలు చేస్తారు. కేటీఆర్ తరపున ఎమ్మెల్యే జీవన్రెడ్డి వ్యవహారాలు చూస్తున్నాడు’. వీటన్నింటిపై సీఎం విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.