Mount Everest: ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ (Everest mountain) అనే విషయం తెలిసిందే. సముద్ర మట్టానికి 3,500 మీటర్లో ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ ను ఏటా వేలల్లో పర్వతారోహకులు అధిరోహిస్తున్నారు. అయితే.. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఇక్కడ పర్వతారోహణ చేయాల్సి ఉంటుంది. ఆర్ధిక స్థోమత, వాతావరణ పరిస్థితులు, అనారోగ్యం కారణంగా వెళ్లలేని వారూ ఉన్నారు. అయితే.. ఇలా వెళ్లలేని వారి కోసం చైనాకి చెందిన డ్రోన్ తయారీ సంస్థ ఓ వినూత్న ప్రయోగాన్ని చేపట్టి సక్సెస్ అయింది.
చైనాకు చెందిన డీజేఐ గ్లోబల్ అనే డ్రోన్ తయారీ సంస్థ.. డ్రోన్ సాయంతో అత్యధ్బుతమైన ఎవరెస్ట్ పర్వతారోహణను చిత్రీకరించింది. పర్వతంపై పరిస్థితులు, మంచు కొండలు, వాతావరణం, పర్వతారోహకులు, బేస్ క్యాంప్, హిమనీ నదాలు, దుప్పటి కప్పినట్టున్న అబ్బురపరిచే మంచు దృశ్యాలను చూస్తూ శిఖరాగ్రభాగం మీదుగా వెళ్తూ కళ్లకు కట్టినట్టు చిత్రీకరించింది. ఈ వీడియో ఎవరు చూసినా తామే పర్వతారోహణం చేస్తున్న భావన కలగాల్సిందే.. మురిసిపోవాల్సిందే. చూడచక్కని ఎవరెస్ట్ అందాలను మీరూ చూసేయండి..
Chinese drone maker @DJIGlobal shared a breathtaking video of its DJI Mavic 3 Pro flying over Mount Everest on Weibo yesterday. The drone ascended 3,500 meters from the base camp to the summit of the highest mountain in the world. pic.twitter.com/Iwyoe45DtS
— Yicai 第一财经 (@yicaichina) July 10, 2024