Switch to English

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన విషయం విదితమే. ఆ భోజనాలు, ఆ పద్ధతి.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

కృష్ణంరాజు భోజన ప్రియుడు గనుక, ఆయన మెచ్చే భోజనాన్ని లక్ష మందికి పెట్టడం ద్వారా ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆయన కుటుంబ సభ్యులు భావించడాన్ని ఎలా తప్పు పట్టగలం.? పైగా, లక్ష మందికి భోజనం పెట్టిన గొప్ప కార్యక్రమాన్ని ఎవరైనా అభినందించి తీరాల్సిందే. కానీ, ఇందులోకి రాజకీయం చొరబడింది. మొగల్తూరు వేదికగా కుళ్ళు రాజకీయాలు తెరపైకొచ్చాయి.

చిరంజీవిని టార్గెట్ చేస్తూ, ప్రభాస్ అభిమానుల పేరుతో కొందరు జుగుప్సాకరమైన చర్చకు తెరలేపారు. ఆ అవసరం ఎవరికి వుంది.? అన్న కోణంలో అటు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు, ఇటు మెగా క్యాంప్ ఆరా తీయకుండా వుంటుందా.? నిజానికి, ఇది పట్టించుకునేంత పెద్ద విషయం కాదు. కాకపోతే, కృష్ణంరాజు – చిరంజీవి అత్యంత సన్నిహితులుగా వుండేవారు. ‘నా సోదర సమానుడు’ అని ఆప్యాయంగా మాట్లాడేవారు కృష్ణంరాజు. అనారోగ్యంతో కృష్ణంరాజు బాధపడుతున్న సమయంలో, ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు చిరంజీవి, అపోలో ఆసుపత్రి ద్వారా చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

ఇక, ప్రభాస్‌ని చిరంజీవి.. తన కుమారుడు చరణ్‌తో సమానంగానే చూస్తారు. ఇదీ అందరికీ తెలిసిన విషయమే. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల విషయమై ఏపీ ప్రభుత్వంలో చర్చలు జరిపిన బృందానికి చిరంజీవి నేతృత్వం వహిస్తే, ఆ బృందంలో ప్రభాస్ కూడా వున్నాడు.

ప్రధానంగా వైసీపీ మీదనే మొగల్తూరు రాజకీయానికి సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై స్పందించాలా.? వద్దా.? అన్నదానిపై అటు ప్రభాస్ తరఫున, ఇటు చిరంజీవి తరఫున.. ఒకింత సంయమనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. స్పందించి, అనవసర రాజకీయ రచ్చకు తెరలేపాలా.? స్థానికంగా పరిస్థితులు అందరికీ తెలుసు గనుక, మాట్లాడకపోవడమే మంచిదన్న కోణంలోనూ ఇరు కుటుంబాలూ ఆలోచన చేస్తున్నాయట.

కాదేదీ రాజకీయానికి అనర్హం.. అన్న కోణంలో రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు జరిగిన ‘బులుగు ప్రయత్నం’ ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అవుతోంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...