కరోనా వైరస్పై పోరులో భాగంగా రేపు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కాబోతున్నారు.. అదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఇప్పటికే రెండు సార్లు ఈ తరహా ‘వీడియో కాన్ఫరెన్స్’లు నిర్వహించారు ప్రధాని. మే 3వ తేదీతో లాక్డౌన్ ముగియనున్న దరిమిలా.. ముఖ్యమంత్రలుతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏప్రిల్ 14వ తేదీలో లాక్డౌన్ ముగియాల్సి వుండగా, దాన్ని మే 3వ తేదీ వరకూ పొడిగించిన విషయం విదితమే. అయితే, ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపుల్ని కేంద్రం ప్రకటిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి వీడియో కాన్ఫరెన్స్ తర్వాత మరిన్ని సడలింపులు రాబోతున్నాయనే చర్చ సర్వత్రా జరుగుతోంది. మరోపక్క, దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తుండడంతో మే 3 తర్వాత కూడా లాక్డౌన్ కొనసాగే అవకాశాలున్నాయనీ, ఇంకోసారి పొడిగింపు తప్ప మరో మార్గం కన్పించడంలేదనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ని ఎత్తివేస్తే.. ఆ తర్వాత భయానక పరిస్థితులు వుంటాయి..’ అని ఇప్పటికే పలు రాష్ట్రాలు అభిప్రాయపడుతున్న సంగతి తెల్సిందే. మే 7వ తేదీ వరకూ తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ని పొడిగించగా, మరికొన్ని రాష్ట్రాలూ ఇదే బాటలో పయనిస్తున్నాయి. అయితే, కేంద్రం ఆలోచనలు కాస్త భిన్నంగా వున్నాయనే చర్చ జరుగుతోంది. లాక్డౌన్ని కొనసాగించినా, చాలా సడలింపులు వుండబోతున్నాయట.
ప్రజల ప్రాణాల్ని కాపాడుతూనే, ఆర్థిక వ్యవస్థను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా వుందనీ, ఈ నేపథ్యంలోనే కేంద్రం ‘కీలకమైన నిర్ణయం’ తీసుకోబోతోందనీ ఢిల్లీ వర్గాల నుంచి లీకులు అందుతున్నాయి. జనం ఎక్కువగా గుమికూడేందుకు అవకాశాలున్న సినిమాలు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ పార్కులు వంటి వాటికి లాక్డౌన్ కొనసాగిస్తూ, మిగతా ముఖ్యమైన అంశాలకు వెసులుబాటు వచ్చే అవకాశాలున్నాయి. ప్రజా రవాణా విషయంలోనే కొంత సందిగ్ధత కొనసాగుతోంది. అన్ని అంశాలపైనా రేపు సాయంత్రానికి ఓ స్పష్టత రాబోతోందట.
553644 161687Following study some of the blog posts inside your web site now, and i genuinely such as your technique for blogging. I bookmarked it to my bookmark site list and are checking back soon. Pls look into my internet web site likewise and make me aware what you consider. 723728
798769 846547Extremely usefull blog. i will follow this blog. keep up the great function. 121090