సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలేసింది.. రైతులు అణచివేతకు ఎదురొడ్డి నిలిచారు.. అయినా, తగ్గేదే లేదంటూ కొత్త వ్యవసాయ చట్టాల విషయమై నరేంద్ర మోడీ సర్కార్ ‘ఓవరాక్షన్’ చేసింది. రైతుల్ని తీవ్రవాదులతో పోల్చింది. దేశ వ్యతిరేక శక్తులంటూ బీజేపీ శ్రేణులు, రైతు నాయకులపై తీవ్రాతి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
కానీ, చివరికి రైతు గెలిచాడు. ప్రధాని నరేంద్ర మోడీ దిగి రాక తప్పలేదు. కొత్త వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు నరేంద్ర మోడీ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. నిజానికి, రైతుల ఉద్యమాన్ని అణచివేయడం ప్రభుత్వానికి కష్టమేమీ కాదు. సులువుగానే ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించింది కేంద్ర ప్రభుత్వం.
ఈ క్రమంలో చాలామంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ ప్రేరేపిత విధ్వంసాలూ జరిగాయి. అయినా, రైతులు వెనక్కి తగ్గలేదు. దేశవ్యాప్తంగా రైతులు ఒక్కటయ్యారు. ప్రధానంగా ఉత్తరాది రైతులు మరింత గట్టిగా నిలబడ్డారు. రోజులు, నెలల తరబడి ఉద్యమం కొనసాగింది.
రైతులు తాము పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చంటూ, మరికొన్ని వెసులుబాట్లు కల్పిస్తున్నట్లుగా కొత్త వ్యవసాయ చట్టాల్ని కేంద్రం కొన్నాళ్ళ క్రితం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రైతులంతా వ్యతిరేకిస్తున్నా, ఈ చట్టాల్ని బలవంతంగా దేశమ్మీద రుద్దేందుకు మోడీ సర్కార్ ప్రయత్నించి భంగపడింది.
ఇది ప్రజాస్వామ్య విజయం. రైతులు తలచుకుంటే, ప్రభుత్వాల్ని భయపెట్టగలరనే విషయం ఇంకోసారి నిరూపితమైంది. ‘జై కిసాన్..’ నినాదం ఇంకోసారి దేశమంతా గట్టిగా వినిపిస్తోంది.
అయితే, ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో బీజేపీకి తగులుతున్న ఎదురుదెబ్బల నేపథ్యంలోనే మోడీ సర్కార్, కొత్త వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకునేందుకు దిగొచ్చినట్లుగా భావించాలేమో.
767094 757677An interesting discussion is price comment. I think that you must write extra on this subject, it might not be a taboo topic but usually individuals are not enough to talk on such topics. To the next. Cheers 379354
784607 609286I like this web blog very much so much superb information . 335424