ప్రాణాంతక కరోనా వైరస్ ను దేశం నుంచి తరిమికొట్టాలంటూ ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు. మూడు వారాలపాటు ఇది అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి మోదీ మాట్లాడారు.
కరోనాను ఎదుర్కొనేందుకు కీలక నిర్ణయం తీసుకుంటానంటూ ఉదయమే ట్వీట్ చేసిన ఆయన.. ఆ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు. దేశం మొత్తం ఈ అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ చేస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు చైనా, ఇటలీ, జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించలేదన్నారు. దీనిని ఎదుర్కోవడానికి స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమని స్పష్టంచేశారు.
ఈ నేపథ్యంలో రాబోయే 21 రోజులు ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొన్నారు. ఇదొక్కటే కరోనాకు మందు అని వివరించారు. ఈ 21 రోజులు అప్రమత్తంగా ఉంటే మనం విజయం సాధించినట్టేనన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కరోనా బాధితుల సంఖ్య లక్షకు చేరుకోవడానికి 67 రోజులు పట్టగా.. మరో లక్ష మందికి అది సోకడానికి 11 రోజులే పట్టిందని, తర్వాత నాలుగు రోజులకే వారి సంఖ్య మూడు లక్షలకు చేరిందని.. దీనినిబట్టి చూస్తే ఆ వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుందో అర్థం చేసుకోవాలని సూచించారు.
కరోనాను ఎదుర్కోవడానికి రూ.15వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
993929 511923Hey! Excellent stuff, please maintain us posted when you post something like that! 810472
616846 204577Some truly nice and utilitarian info on this internet site , likewise I think the style and style holds great attributes. 979877