కరోనా ఎన్నో జీవితాలను తలకిందులు చేసింది. ప్రముఖ వ్యాపార సంస్థల నుండి డైలీ కూలీలు రోడ్డు మీద వ్యాపారాలు చేసుకునే వారి వరకు అందరికి నష్టాలను మిగిల్చింది.
హైదరబాద్కు చెందిన వంశీకృష్ణ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి తన ఉద్యోగం మానేసి మొబైల్ క్యాంటీన్ పెట్టాలనుకున్నాడు. అందుకోసం చాలా ప్రత్యేకమైన వాహనంను తయారు చేయించాడు. మద్యప్రదేశ్లో రూ.12 లక్షలు ఖర్చు చేసి మొబైల్ క్యాంటీన్ కు సంబంధించిన కిచెన్ సెటప్ను రెడీ చేయించారు. దానికి హైదరాబాద్కు తీసుకు వచ్చి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా కరోనా వచ్చి పడింది.
హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎక్కువగా ఉన్న చోట ఈ మొబైల్ క్యాంటీన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే కరోనా కారణంగా 80 శాతం వరకు సాప్ట్ వేర్ కంపెనీలు ఎంప్లాయిస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. దాంతో దీనిని ప్రారంభించడం సాద్యం అవ్వడం లేదు. ప్రస్తుతం ఆ వాహనం పక్కకు పెట్టేసి ఉంది. దాని చుట్టు చెట్లు మొలిచాయి. పిచ్చి చెట్ల మద్యలో 12 లక్షల రూపాయలను ఆయన ఉంచాడు.
ఆ విషయం బాధగా ఉన్నా త్వరలోనే మళ్లీ ప్రారంభిస్తాను అనే నమ్మకంతో వంశీకృష్ణ ఉన్నాడు. పీపా ఆకారంలో ఆయన తయారు చేయించిన కిచెన్ సెట్ కు అంతా కూడా ఫిదా అవుతున్నారు. ప్రారంభం అయితే ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించవచ్చు అంటున్నారు.
923932 109774I appreciate your function , thanks for all the informative weblog posts. 608238
235469 211250Its almost impossible to discover knowledgeable men and ladies during this subject, however you sound like do you know what youre discussing! Thanks 391796