దురదృష్టవశాత్తూ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు.. ఇవీ, ఓ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నేత, ‘జాగృతి’ పేరుతో, తెలంగాణ రాజకీయాల్లో తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న కవిత చేసిన వ్యాఖ్యలు. భారత్ రాష్ట్ర సమితిగా ప్రస్తుతం చెలామణీలో వున్న ఒకప్పుటి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్ కుమార్తె కవిత, రాజకీయ ప్రసంగాలు చేయడంలో దిట్ట. మంచి మాటకారితనం కూడా వుందామెలో.
రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించడంలో, తేలిక పద జాలాన్ని వాడేయడం కేసీయార్ కుటుంబంలో అందరికీ అలవాటే. కేసీయార్, హరీష్ రావు, కేటీయార్, కవిత.. ఇలా అందరిదీ ఒకే బాట. తెలంగాణ ఉద్యమ సమయంలో అంతా చెల్లిపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి.
అసలు సీరియస్ పొలిటీషియన్ అంటే ఏంటి.? ప్రతిపక్ష నేత హోదా వున్నా, అసెంబ్లీకి కేసీయార్ వెళ్ళకపోవడమా.? అని జనసేన శ్రేణులు కవితని ప్రశ్నిస్తున్నాయి. సీరియస్ పొలిటీషియన్ అంటే ఏంటి.? లిక్కర్ స్కామ్ చేసి, జైల్లో చిప్ప కూడు తినడమా.? అని జనసేన శ్రేణులు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.
అధినేత పోటీ చేసిన రెండు చోట్లా 2019లో ఓడిపోయినా, నిబద్ధతతో రాజకీయం చేసి, ప్రజల పక్షాన నిలబడి, 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధించిన ఘనత జనసేన సొంతం.
ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది కౌలు రైతుల కుటుంబాలకు, లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం.. అది కూడా, వ్యక్తిగత సంపాదన నుంచి అందించిన సీరియస్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్.
డిప్యూటీ సీఎం అయి వుండీ, కేవలం ప్రభుత్వ నిధుల్ని సద్వినియోగం చేయడమే కాదు, వ్యక్తిగత సంపాదన నుంచి, ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ మాత్రమే.. ఈ దేశంలో. ఇదంతా అర్థం చేసుకుని, కవిత ఇకపై సిల్లీ పొలిటికల్ కామెంట్స్ చేయకుండా వుంటారేమో వేచి చూడాలి.