MLC Elections In AP: ‘ఒక అమ్మకీ ఒక అబ్బకీ పుట్టినోళ్ళెవరూ పార్టీకి ద్రోహం చెయ్యరు..’ వైసీపీ ఎంపీ మార్గాని భరత్, ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమంలో ‘ఎమ్మెల్సీ కోటా ఎన్నికల ఫలితాలపై’ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల సారాంశం.
మంత్రి జోగి రమేష్ అయితే, ‘మా ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేశారు’ అంటూ మండిపడ్డారు. వైసీపీలో చాలామంది నేతలు చెబుతున్నమాట ఇదే. తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీలో వున్న సంఖ్యాబలం 23. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధకు వచ్చిన ఓట్లు 23.
సో, టీడీపీ ఓట్లు టీడీపీకే పడ్డాయి.. టెక్నికల్గా చూస్తే. కానీ, టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించారు. వాళ్ళంతా వైసీపీకే ఓటేశారట. వైసీపీ నుంచి మాత్రం నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటేశారు. అదే అసలు బాధ వైసీపీకి.! అందుకే, ‘ఒక అమ్మకీ, ఒక అబ్బకీ పుట్టి వుంటే..’ అంటూ మార్గాని భరత్ తీవ్ర వ్యాఖ్యలు చేసేదాకా వెళ్ళారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి, జోగి రమేష్.. ఇలా వైసీపీలో చాలామంది నేతలు తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారంటూ గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోవడం నిజమైతే, ఇది ఇక్కడితో ఆగదు. అమ్మకానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా వుంటే, పార్టీలు కొనుక్కోకుండా వుంటాయా.?
‘మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారు’ అని వైసీపీ ప్రకటించేసుకున్నాక, చంద్రబాబు అండ్ టీమ్ సూట్ కేసులతో సిద్ధంగా వుంటుందని వైసీపీ ఎందుకు అనుకోలేకపోతోంది.? సరే, చంద్రబాబు కొంటున్నారా.? లేదా.? అన్నది వేరే చర్చ. వైసీపీ ఎమ్మెల్యేలైతే అమ్ముడుపోతున్నారు. అందులో కొందరు ‘ఒక అమ్మకీ, ఒక అబ్బకీ పుట్టలేదు’ అని వైసీపీ ఎంపీనే అన్నాక, వైసీపీలో ఏ ప్రజా ప్రతినిథి అయినా ఎందుకు వుండాలి.?
రాత్రికి రాత్రి వైసీపీ జాతకం తిరగబడిపోయింది.! ఇదీ రాజకీయమంటే.!
944023 125814Cheers for this superb. I was wondering whether you were planning of publishing comparable posts to this. .Maintain up the excellent articles! 708553