Switch to English

వీడిన మిస్టరీ..! సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ పాత్ర ఇదే: కాకినాడ ఎస్పీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,517FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య మిస్టరీ వీడింది. కేసు వివరాలను కాకినాడ ఎస్పీ రవీంద్రనాధ్ మీడియాకు వివరించారు. ‘సుబ్రహ్మణ్యం మృతిపై అతని తల్లి ఫిర్యాదు మేరకు మొదట అనుమానాస్పద కేసు నమోదు చేశాం. అనంతరం బంధువుల వాంగ్మూలం మేరకు హత్య కేసుగా నమోదు చేశాం. దర్యాప్తులో లభించిన ఆధారాలు, వాంగ్మూలాల ఆధారంగా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశాం. జీజీహెచ్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించాం. ఆరు బృందాలుగా గాలించి ఈరోజు అనంతబాబును కస్టడీలోకి తీసుకున్నాం’ అని తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

‘ఈనెల 19న సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఆరోజు రాత్రి 8గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి స్నేహితులతో కలిసి మద్యం సేవించారు. 10గంటల సమయంలో రోడ్డుపైకి వస్తున్న సమయంలో అనంతబాబు అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యంను కారులో తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి టిఫిన్ తీసుకుని అనంతబాబు ఇంటి సమీపంలోకి వెళ్లారు. సుబ్రహ్మణ్యం పెళ్లికి అనంతబాబు చేసిన ఆర్ధికసాయం విషయంలో ఇద్దరి మధ్యా చర్చ జరిగింది. అప్పటికే సుబ్రహ్మణ్యం కొంత చెల్లించి ఉన్నాడు. నువ్వింకా తాగుతూనే ఉన్నావ్. నిన్ను పనిలోకి తీసుకోవాలని మీ అమ్మ అడుగుతోంది. నీలో ఎలాంటి మార్పూ రాలేదు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడం.. సుబ్రహ్మణ్యంను అనంతబాబు కొట్టడం జరిగింది’.

‘ఎదురు ప్రశ్నించిన సుబ్రహ్మణ్యంను కోపంతో అనంతబాబు మెడపట్టి పక్కకు తోశాడు. దీంతో పక్కనే డ్రైనేజీ గట్టుపై పడ్డ సుబ్రహ్మణ్యం తలకు గట్టి దెబ్బ తగిలింది. మరోసారి సుబ్రహ్మణ్యం ఎదురు తిరగడంతో మళ్లీ తోయడంతో సుబ్రహ్మణ్యం తలకు మరోసారి గట్టి దెబ్బ తగిలింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలని భావించినా అప్పటికే సుబ్రహ్మణ్యంకు వెక్కిళ్లు రావడంతో తాగేందుకు నీరు ఇచ్చాడు. అయితే.. కొద్దిసేపటికే సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. గతంలో అనంతబాబు వద్ద పని చేసేటప్పుడు సుబ్రహ్మణ్యం అనేకసార్లు యాక్సిడెంట్ చేసిన ఘటనలు ఉన్నాయి. దీని ఆధారంగా హత్యను యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని భావించాడు. రోడ్డు మీద కుదరకపోవడంతో సమీపంలోని డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి అందుబాటులో ఉన్న తాళ్లు, కర్రలతో సుబ్రహ్మణ్యం ఒంటిపై బలమైన గాయాలయ్యేలా చేశారు’.

‘అర్ధరాత్రి 12.30 సమయంలో సుబ్రహ్మణ్యం తల్లికి ఫోన్ చేసి “సుబ్బుకు యాక్సిడెంట్ అయినట్టు నాకు ఫోన్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్తున్నాను. అక్కడికి రండి” అని అనంతబాబు చెప్పారు. అప్పటికే వైద్యులు మృతి చెందినట్టు ధ్రువీకరించడంతో కారులోనే మృతదేహాన్ని తీసుకెళ్లి వారి ఇంటి వద్ద వదిలేశారు. అయితే.. గాయాలు యాక్సిడెంట్ లా లేవని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో సుమారు గంటకు పైగా వీరి మధ్య వాదనలు జరిగాయి. ఉదయం 4గంటలకు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవన్నీ ప్రాధమిక దర్యాప్తు ద్వారా నిర్ధారణకు వచ్చిన వివరాలు’ అని ఎస్పీ తెలిపారు.

నిందితుడు అనంతబాబును భారీ బందోబస్తు మధ్య కాకినాడ ఏఆర్ కార్యాలయం నుంచి జీజీహెచ్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అనంతబాబును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే...

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో...

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక...

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది....

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా...

రాజకీయం

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

ఎక్కువ చదివినవి

అరుణ్ ఆదిత్య – అప్సర రాణి జంటగా కొత్త సినిమా ప్రారంభం

అరుణ్ ఆదిత్య - అప్సర రాణి జంటగా, వినూత్న సెల్యూలాయిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కృష్ణబాబు దర్శకత్వంలో కొత్త సినిమా ప్రొడక్షన్ నం.1 ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మం ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది....

పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత: పిఠాపురం ఎవరిది.?

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు పోటీగా,...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రు’...

క్రికెటర్ శ్రీశాంత్ ముఖ్యపాత్రలో యమధీర ఈ నెల 23న

కన్నడ హీరో కోమల్ కుమార్ హీరోగా, ఇండియన్ క్రికెటర్ శ్రీశాంత్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తూ మన ముందుకు రానున్న చిత్రం యమధీర. శ్రీమందిరం ప్రొడక్షన్స్ లో వేదాల శ్రీనివాస్ నిర్మిస్తున్న తొలి...