సీమకు నీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాడతామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలో రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్పై ఆ ప్రాంత టీడీపీ నేతలు నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. రాయలసీమకు నీరు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. వైసీపీ పాలనలో నీటిపారుదల ప్రాజెక్టుల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. సీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని అన్నారు. రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్ కృషి చేశారని.. ఎన్టీఆర్ హంద్రీనీవా ప్రాజెక్ట్ తెచ్చారని అన్నారు.
హంద్రీనీవా ద్వారా చెరువులకు నీరిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని.. చెరువులకు పుష్కలంగా నీరు అందించడంలేదని బాలకృష్ణ ధ్వజమెత్తారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య వైసీపీ నేతలు చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. బీటీ ప్రాజెక్టుకు, చెరువులకు నీరివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాని బాలకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లాలో అన్ని చెరువులకు నీరు ఇవ్వాలని ఈ సందర్భంగా బాలకృష్ణ డిమాండ్ చేశారు.
947540 999688But a smiling visitant here to share the really like (:, btw wonderful style and style . 639237
414638 73459Hello! I just want to make a enormous thumbs up with the wonderful info youve here during this post. We are returning to your weblog for additional soon. 280315