Switch to English

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి రోడ్ల అభివృద్ధిపై కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,202FansLike
57,764FollowersFollow

క్యాబినెట్ సమావేశం ప్రారంభానికి ముందు పలు మంది మంత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తమ నియోజకవర్గాల రహదారి నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం కాలంలో గ్రామీణ ప్రాంతాల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్న కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు పునర్నిర్మాణ పనులు ప్రారంభం అవుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారని మంత్రులు పవన్ కళ్యాణ్‌గారికి వివరించారు. తమ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు అన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి రోడ్ల అభివృద్ధిపై కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు

పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, నారాయణ, నాదెండ్ల మనోహర్, సవిత, డి.వి.బి. స్వామి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, రాంప్రసాద్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ వంటి కీలక మంత్రులు పవన్ కళ్యాణ్‌ను కలిసి అభినందనలు తెలిపారు. గ్రామీణ రహదారి అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని వారు పేర్కొన్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి రోడ్ల అభివృద్ధిపై కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు

ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ మొదటి విడతగా రహదారి పటిష్టత పనులకు సంబంధించిన జీవోను జారీ చేసింది. మొత్తం 157 నియోజకవర్గాల్లో 1299 రోడ్ల అభివృద్ధి చేపట్టబడుతోంది. ఇందుకోసం రూ.2123 కోట్ల సాస్కీ నిధులను విడుదల చేస్తూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 26 జిల్లాల్లోని 157 నియోజకవర్గాలకు చెందిన 4007 కిలోమీటర్ల రహదారులను పటిష్టపరచే దిశగా కార్యాచరణ వేగవంతమైంది.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి రోడ్ల అభివృద్ధిపై కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు

‘పల్లె పండుగ 2.0’ పేరిట గ్రామీణ రహదారి నిర్మాణాలను ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోంది. ఈ ప్రాజెక్ట్‌లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల శంకుస్థాపన చేయడం గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొత్త ఊపునిచ్చింది.

సినిమా

8 రోజుల్లో రాజా సాబ్… ఇంకా దూరమే గమ్యం!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ మధ్య తన ప్రయాణాన్ని...

మెగాస్టార్ అంటే ఏంటో మళ్లీ గుర్తు చేసిన “మన శంకర వర...

“చిరంజీవి సినిమా బాగుందంట…”ఈ మాట ఈ మధ్య మళ్లీ థియేటర్ నుంచి థియేటర్‌కి, మాట నుంచి మాటకి తిరుగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సెన్సేషన్… 5 రోజుల్లోనే ₹226...

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను లిఖిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ...

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

రాజకీయం

పవన్ కళ్యాణ్: పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చే కూటమి ప్రభుత్వం… గ్రీన్ ఎనర్జీలో ఏపీకి కొత్త దిశ

పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వాలు మారినా విధానాల్లో స్థిరత్వం ఉండాలన్నదే తమ ప్రభుత్వ...

మాట నిలబెట్టుకున్న సీఎం… ఉద్యోగుల ఖాతాల్లో నగదు

సంక్రాంతి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన పండుగలా మార్చింది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఒకేసారి విడుదల...

Liquor Scam Case: విజయ్ సాయిరెడ్డికి ఈడీ నోటీసులు..

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయ్ సాయిరెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన...

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

ఎక్కువ చదివినవి

CHIRANJEEVI: చిరంజీవి క్రేజ్, రేంజ్ ఏంటో చూస్తున్న ‘Gen Z’

CHIRANJEEVI: ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా..., నువ్వో చిరంజీవి మరి.., చిరంజీవిలా ఆ ఫోజేంటేహే’.. ఇదీ 80, 90 దశకాల్లో చిరంజీవి హవా. చెప్పాలంటే రాజకీయాల్లోకి వెళ్లే (2008) వరకూ ఇదే పరిస్థితి. చిరంజీవిని...

సంక్రాంతికి భారీ ఊరట: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు రూ.2653 కోట్ల విడుదల

అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు భారీ ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెండింగ్‌లో...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.183 కోట్లకు...

Daily Horoscope: కన్యకు ఉద్యోగ లాభం, మకరానికి ఆర్థిక స్థిరత్వం

జనవరి 16, 2026 శుక్రవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. పనిలో ఒత్తిడి ఉన్నా ధైర్యంగా ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో చర్చలు అనుకూలంగా సాగుతాయి....