ఒక రాష్ట్రానికి నాయకత్వం వహించే వ్యక్తులు ఎలా ఉండాలి… అందరికి నచ్చే విషయాలు మాట్లాడే వారిలా ఉండాలి. అందరి మంచిని గురించి మాట్లాడే వ్యక్తుల మాదిరిగా ఉండాలి. అంతేగాని, తమకు ఇష్టం వచ్చిన విధంగా వచ్చిన భాషలో వినకూడని పదాలతో దూషణలు చేస్తుంటే వాళ్ళను ఏమంటారు.. కనీసం రోజువారీ కూలి పనులు చేసుకునే వ్యక్తులు కూడా ఒక్కోదగ్గర అలాంటి భాషను వాడేందుకు ఆలోచిస్తారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు మాట్లాడుతున్న భాష చూస్తుంటే… ఇలాంటి వ్యక్తులను ప్రజలు ఎలా ఎన్నుకున్నారు అని బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది.
నాయకులుగా ఉండి దూషణలు చేయడంలో తప్పులేదు. విమర్శలు కూడా సద్విమర్శలుగా ఉండాలి తప్పించి, ప్రజల చేత ఛీ కొట్టించే విధంగా ఉండకూడదు. ఇలాంటి దారుణమైన భాషను వాడాలని ఏ రాజ్యాంగం చెప్పలేదు. అందుకే అంటారు ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అని. ఇలాంటి మాటలు సామాన్యుల కంటే ఇప్పుడున్న మంత్రి వర్యులు మాట్లాడుతున్నారు. ఆ మాటలు విని ప్రజలే సిగ్గుపడుతున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు.
అధికారపక్షం మీద ప్రతిపక్షానికి, ప్రతి పక్షం మీద అధికారపక్షానికి కోపం ఉండొచ్చు. అది రాజకీయంగా ఉండాలి తప్పించి వ్యక్తిగతంగా దూషణకు వెళ్లడం నేరం అవుతుంది. విదేశాల్లో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే వెంటనే పదవుల నుంచి తొలగించేస్తారు. కానీ, ఇక్కడ ఏం జరుగుతోంది. అంతా రివర్స్.. ఎవరైతే గల్లా పట్టి మాట్లాడతారో, ఎవరైతే అవతలి వ్యక్తులను తలదించుకునేలా మాట్లాడతారో వారికే పట్టం గడుతున్నారు. వారికే జైజైలు కొడుతున్నారు.
నాయకుల్లో మార్పు రావాలంటే ముందు ప్రజల్లో మార్పు రావాలి. ప్రజలు ఓటు వేసే సమయంలో ఎవరు ఎలాంటి వ్యక్తుల్లో గమనించి ఓటు వేస్తె… మన రాజకీయాలు ఇలా ఉండవు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తోంది. అంతకు మించి దేనికి ఉపయోగం లేకుండా పోయింది.
621607 446902This can indicate that a watch has spent some or all of its life inside the tropics and was not serviced as regularly as it ought to have been. 843340