వేతనాలు పెంచాలని సమ్మె ప్రారంభించిన టాలీవుడ్ సినీ కార్మికులు రెండో రోజు కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. దీంతో 25 సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. మరోవైపు.. షూటింగులకు హాజరైతేనే వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని సి.కల్యాణ్ అంటున్నారు. దీంతో పంచాయతీ తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వద్దకు చేరింది.
‘ఇచ్చిన మాటకు కట్టుబడి వేతనాలు పెంచుతాం. కాకపోతే.. ముందు అందరూ షూటింగులకు హాజరవ్వాలి. 15రోజులపాటు పాత పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలని నిర్మాతలకు సూచించాం. సమ్మెతో ఈరోజు షూటింగ్స్ నిలిచిపోయాయి. ఇలాగే చేస్తే ఎవరితో పని చేయించుకోవాలో వారితో చేయించుకుంటాం. కుదరకపోతే నిరవధికంగా షూటింగ్స్ నిలిపివేస్తాం’ అని సి.కల్యాణ్ స్పష్టం చేశారు.
‘సమస్య ఇరువైపులా ఉంది. సామరస్యంగా చర్చించుకుని సమస్య పరిష్కరించుకోవాలి. కరోనా కారణంగా వేతనాలు పెంచలేదు. ఇప్పుడు పంతాలకు పోవడం మంచిది కాదు. ఇరుపక్షాలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఇరు వర్గాలకు న్యాయం జరిగేలా కూర్చుని మాట్లాడుకోవాల’ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
324834 981080Pretty! This was a truly great post. Thank you for your provided information. cool desktop 881706
293952 426923This really is how to get your foot in the door. 692788
546576 636569Hey there, I think your blog might be having browser compatibility issues. When I look at your web site in Safari, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, superb weblog! 625468
148518 146441Some truly good stuff on this internet site , I like it. 579253