Switch to English

కనిగిరిలో రిలయన్స్ సిబిజి ప్లాంట్ కు మంత్రి లోకేష్ భూమిపూజ..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

సీఎం చంద్రబాబు చెప్పిన పి4 విధానానికి రిలయన్స్ సిబిజి ప్లాంట్స్ నాంది కానున్నాయి.. రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడంలో ఇదొక ముఖ్యమైన అడుగు కాబోతుందని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కు మంత్రి నారా లోకేష్ భూమిపూజ చేశారు.

నీటి వసతి లేని మెట్ట ప్రాంతంలో రైతులకు ఈ ప్లాంట్స్ ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని అన్నారు. ఇక్కడ నైపర్ గడ్డితో గ్యాస్ తయారు చేయబోతున్నారు. ప్రభుత్వ భూములకు 15 వేలు, రైతుల భూములకు 31 వేల కౌలు కూడా ఇవ్వబోతున్నారని అన్నారు. రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసే సిబిజి ప్లాంట్లన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తే ఏటా 110 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువు తయారవుతుంది. ఈ ప్లాంట్ల ద్వారా గ్రామీణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని అన్నారు నారా లోకేష్.

ప్రకాశం జిల్లా వచ్చిన ప్రతిసారి మీరు చూపించే ప్రేమ, ఆప్యాయత మర్చిపోలేనని.. ప్రకాశం జిల్లాలో పేదరికం లేకుండా చేయడమే మా లక్ష్యమని అన్నారు నారా లోకేష్. ఆధ్రప్రదేశ్ లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ కి రిలయన్స్ 65 వేల కోట్ల పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా 500 ప్లాంట్లు పెట్టడానికి రిలయన్స్ ముందుకొచ్చింది. దీని వల్ల 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడప లో 5 లక్షల ఎకరాల భీడు భూమిని ఇందుకు వినియోగిస్తున్నామని అన్నారు నారా లోకేష్.

ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, చీఫ్ సెక్రటరీ విజయానంద్, ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి, అశోక్ రెడ్డి, కందుల నారాయణ రెడ్డి, ఏలూరి సాంబశివరావు, కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వర రావు పాల్గొన్నారు.

సినిమా

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

కపుల్ ఫ్రెండ్లీ’పై సిద్ధు జొన్నలగడ్డ ప్రశంసల పోస్ట్

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా థియేటర్లలో మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాపై స్టార్ బాయ్ సిద్ధు...

రాజకీయం

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై విశాఖలో సాధు పరిషత్ ఆందోళన

ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆధ్వర్యంలో తిరుమల దేవదేవుని లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు తయారు చేసే ప్రసాదమైన లడ్డూ పవిత్రతపై అనుమానాలు...

 జీఓ 117 రద్దుతో ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ విద్యార్థులు: అసెంబ్లీలో నారా లోకేష్ వెల్లడి 

అమరావతి: గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 117 కారణంగా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన...

చంద్రబాబు మీద ద్వేషమా.? బిల్ గేట్స్ మీద ద్వేషమా.?

బిల్ గేట్స్ అంటే కంప్యూటర్.. కంప్యూటర్ అంటే బిల్ గేట్స్.. ఒకప్పుడు కంప్యూటర్ యుగంలోకి అడుగు పెట్టిన యువతీ యువకులంతా బిల్ గేట్స్ గురించి ఇలానే మాట్లాడుకునేవారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కి...

ఎక్కువ చదివినవి

నందిపాటి వంశీ: ‘హే భగవాన్’ నవ్విస్తుంది.. హృదయాన్ని తాకుతుంది

ఇటీవల లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బన్నీ వాస్–నందిపాటి వంశీ జంట మరో వినోదాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్,...

పెద్దికి ఆర్‌.ఆర్‌ టచ్.. రామ్ చరణ్ ఇంట్రోతో థియేటర్లు దద్దరిల్లే సూచనలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది తాజా అప్‌డేట్‌తో మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా ఫస్ట్ హాఫ్ రీ-రికార్డింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దర్శకుడు బుచ్చి బాబు...

Daily Horoscope: మేషంలో లాభయోగం, సింహంలో కెరీర్ ముందడుగు

ఫిబ్రవరి 16, 2026 సోమవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు పనుల్లో చురుకుదనం పెరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుకూలంగా వ్యవహరిస్తారు. చిన్న ప్రయాణాలు లాభం...

ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులపై లోకేష్ కీలక వ్యాఖ్యలు

అమరావతిలో జరిగిన శాసనమండలి సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతులు, నాడు–నేడు, మనబడి–మన భవిష్యత్ పథకాల అమలుపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విస్తృతంగా స్పందించారు. ప్రభుత్వ పాఠశాలలను...

‘ఏమో ఏమో ఇది’ గ్లింప్స్‌తో హార్ట్ టచ్ చేసిన కొత్త ప్రేమకథ

శైలేష్ కొలను దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న కొత్త రొమాంటిక్ కామెడీ సినిమా ‘ఏమో ఏమో ఇది’ టైటిల్ గ్లింప్స్ విడుదలతోనే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా...