‘కేంద్ర ప్రభుత్వ తీరును, ప్రధాని మోదీని నేను విమర్శిస్తుంటే బాధ పడేవారు నన్ను ట్విట్టర్ లో ఫాలో కావొద్దు.. తక్షణమే అన్ ఫాలో అవండి’ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈమేరకు ట్విట్టర్ లో వెల్లడించారు. తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలు, మతతత్వ భావాలతో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని తాను నిత్యం విమర్శిస్తూనే ఉంటానని అన్నారు.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన కేంద్రంపై కేటీఆర్ విమర్శలు సంధించారు. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర పెంపుపై కూడా ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ పెంపు ఏప్రిల్ ఫూల్ తరహా జోక్ అయితే బాగుండేదని అన్నారు. ‘అచ్చే దిన్ దివస్’ను ఏప్రిల్ ఫూల్స్ డేగా పోలుస్తూ వ్యంగ్యంగా మరో ట్వీట్ చేశారు. చమురు సంస్థలు 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.250 పెంచడంతో ప్రస్తుతం ఆ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,253కి చేరుకుంది. పెంచిన ధరలు నేటి నుంచే అమలులోకి వస్తాయని కూడా ప్రకటించింది.
I am seriously hoping this is an April fools joke! https://t.co/9smrxq6jTt
— KTR (@KTRTRS) April 1, 2022
April fools day aka #AchheDin Diwas 😄 https://t.co/pHuIlfsp7o
— KTR (@KTRTRS) April 1, 2022
Wow cuz this is very helpful work! Congrats and keep it up. [url=http://228.idaegu.com/bbs/board.php?bo_table=free&wr_id=382715]où acheter moperidona France[/url]