హైదరాబాద్ ను దేశంలోని ఉత్తమ నగరాల్లో కాకుండా ప్రపంచంలోని 30 ఉత్తమ నగారాల్లో ఒకటిగా ఉంచాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. 2021-2022 ఏడాదికి సంబంధించి పురపాలక శాఖ వార్షిక నివేదికను హైదరాబాద్ నానాక్ రాంగూడలో విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి స్మార్ట్ సిటీలు ఎక్కువగా కేటాయించి.. అందుకు అవసరమైన నిధులను కూడా కేటాయించాలి. 2050 నాటికి దేశంలో పట్టణ జనాభా 50 శాతంగా ఉంటుందని నీతియోగ్ అంటున్నా.. 2025కే తెలంగాణలో ఆ పరిస్థితులు ఏర్పడతాయి. ఏడాదిగా హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో మౌలికవసతులు, పౌర సేవలు కల్పించాం’.
‘పురపాలక శాఖలో ఎంత బాగా పని చేసినా సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇళ్ల నిర్మాణంలో హైదరాబాద్ దూసుకెళ్తోంది. ఇళ్ల ధరలు కూడా హైదరాబాద్ లోనే తక్కువగా ఉన్నాయి. ఆఫిస్ స్పేస్ లో బెంగళూరును హైదరాబాద్ అధిగమించింది. అన్నిరంగాల్లో తెలంగాణ దూసుకుపోతోంది’ అని అన్నారు.
563315 28449If I must say something, then absolutely nothing will stop the chatter within 933973
122776 537663Now we know who the ssebnile 1 is here. Excellent post! 552010