కరోనా కారణంగా లాక్డౌన్తో దేశ వ్యాప్తంగా వలస కార్మికులు ఎంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. దేశ వ్యాప్తంగా కూడా కొన్ని లక్షల మంది వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. కొందరు దొరికిన వాహనాలు పట్టుకుని వెళ్తుంటే మరికొందరు సైకిళ్ల మీద, కాలి నడకన వందలు, వేల కిలోమీటర్లు కూడా ప్రయాణిస్తున్నారు. చావో బతుకో సొంత ప్రాంతంలోనే అంటూ వలస కూలీలు సొంత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. కాలి నడకన వెళ్తున్న వారు పలువురు మృత్యువాత పడుతున్నారు.
తాజాగా హైదరాబాద్ నుండి ఒడిశాకు కాలి నడకన ప్రయాణం అయిన 21 ఏళ్ల వలస కార్మికుడు భద్రాచలం వద్ద కుప్పకూలి పోయాడు. హైదరాబాద్ నుండి అతడు దాదాపుగా 300 కిలో మీటర్లు నడిచిన తర్వాత తీవ్రమైన ఎండ దెబ్బ కొట్టడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. తీవ్రమైన చాతి నొప్పి, వాంతులు చేసుకున్న ఆ యువకుడు అక్కడికి అక్కడే మృతి చెందాడు. ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లాకు చెందిన ఈ యువకుడు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇలా ఇంకా ఎంత మంది మృతి చెందాలంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
21 ఏళ్ల యువకుడు అలా మృతి చెందగా మహారాష్ట్రలో ఒక గర్బవతి కాలి నడకన తన సొంత గ్రామానికి వెళ్తూ మార్గ మద్యలోనే ప్రసవించింది. నిండు గర్బిని అయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో 150 కిలో మీటర్లు నడిచింది. ప్రసవం తర్వాత కేవలం రెండు గంటలు వెయిట్ చేసి మళ్లీ తన ప్రయాణంను కొనసాగించడం ప్రతి ఒక్కరిని కదిలించింది. దేశంలో ఇలాంటి సంఘటనలు ప్రతి రోజు ఏదో ఒక చోట నమోదు అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు తీసుకుంటు చర్యలు ఏమాత్రం ప్రతిఫలం ఇవ్వక పోవడం వల్లే ఇలాంటి మరణాలు జననాలు సంభవిస్తున్నాయి.
532336 875810hello, i came in to learn about this topic, thanks alot. will put this website into my bookmarks. 579776
403188 214719This is a correct weblog for would like to find out about this subject. You realize a good deal its almost challenging to argue along (not that I personally would wantHaHa). You in fact put the latest spin with a topic thats been discussed for a long time. Great stuff, just wonderful! 150053
365009 403736This weblog actually is good. How was it produced ? 499959