కరోనా వైరస్ కారణంగా ప్రపంచం ఎంత అల్లకల్లోలం అవుతోందో చూస్తున్నాం. ముఖ్యంగా వలస కూలీలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చేయడానికి పనిలేక, చేతిలో చిల్లిగవ్వ లేక, తినడానికి తిండి లేక అష్టకష్టాలు పడుతున్నారు. ఇక అక్కడ ఉండి చేసేదేమీ లేదని చాలామంది కాలినడకనో, ఇతరత్రా మార్గాల ద్వారాలో సొంతూళ్లకే పయనమయ్యారు. వారం రోజుల క్రితం నుంచే వలస కూలీల తరలింపునకు కేంద్రం రైళ్లు నడుపుతోంది. కానీ అందులో ప్రయాణించడానికి బోలెడు నిబంధనలతోపాట చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో పలువురు ఇతరత్రా మార్గాల్లోనే వెళ్లడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
తాజాగా ఓ వ్యక్తి రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లడం కోసం ఓ సైకిల్ దొంగిలించాడు. దానిపై దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్దామన్నది ఆయన ఆలోచన. అయితే, సైకిల్ దొంగతనం చేసేముందు దాని యజమానికి క్షమాపణ చెబుతూ ఓ కాగితం రాసిపెట్టడం విశేషం.
యూపీలోని బరేలీకి చెందిన మహ్మద్ ఇక్బాల్ ఖాన్ రాజస్థాన్ లోని భరత్ పూర్ లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇక అక్కడ ఉండి లాభం లేదని, ఇంటికి వెళ్లిపోదామని నిర్ణయం తీసుకున్నాడు. ఎలాంటి రవాణా వసతి లేకపోవడంతో సైకిల్ దొంగిలిద్దామని నిర్ణయానికి వచ్చాడు. సాహిబ్ సింగ్ అనే వ్యక్తికి చెదిన సైకిల్ ను ఇక్బాల్ తస్కరించాడు. సాహిబ్ కు క్షమాపణ చెబుతూ రాసిన లేఖను అక్కడ ఉంచి వెళ్లిపోయాడు.
మర్నాడు తన సైకిల్ లేకపోవడం గుర్తించిన సాహిబ్ సింగ్.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించాడు. ఈలోగా ఇక్బాల్ రాసిన లేఖ దొరికింది. ‘‘నమస్తే జీ.. నేనో కూలీని. నిస్సహాయుడిని. మీ సైకిల్ తీసుకెళ్తున్నాను. వీలుంటే క్షమించండి. నాకు వికలాంగుడైన పిల్లవాడు ఉన్నాడు. తన కోసం తప్పక ఈ పని చేయాల్సి వచ్చింది. మేం బరేలీకి వెళ్లాల్సి ఉంది’’ అని అందులో పేర్కొన్నాడు. దీంతో అతడి దుస్థితికి బాధపడిని సాహిబ్ సింగ్.. పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న ఆలోచన విరమించుకున్నాడు.
449308 619992hi great page i will definaely come back and see again. 582104
684075 100302hey I was quite impressed with the setup you used with this weblog. I use blogs my self so very good job. definatly adding to bookmarks. 513796