తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్న గొప్ప నటుడు, టెక్నీషియన్.. తెలుగు జాతి ఎప్పటికి గుర్తుంచుకోదగ్గ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు శత జయంతి నేడు. ఆ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఇండస్ట్రీ వర్గాల వారు పెద్ద ఎత్తున ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించాడు. చిరు ట్విట్టర్ లో.. నూటికో కోటికో ఒక్కరు… వందేళ్లు కాదు…చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాల కి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు శ్రీ NTR. తెలుగు జాతి ఘనకీర్తి కి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం. రామారావు గారి శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ అంటూ ట్వీట్ చేశారు.
చిరంజీవి కి ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. రాజకీయాల్లోకి వెళ్లక ముందు మరియు వెళ్లిన తర్వాత కూడా ఎన్టీఆర్ కి చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఇద్దరు కలిసి తిరుగులేని మనిషి సినిమా లో నటించి ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాత ఆస్థాయి క్రేజ్ దక్కించుకున్నది చిరంజీవి అనడంలో సందేహం లేదు.
నూటికో కోటికో ఒక్కరు… వందేళ్లు కాదు…చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాల కి గర్వంగా చెబుతుంది.
అలాంటి కారణ జన్ముడు శ్రీ NTR.
తెలుగు జాతి ఘనకీర్తి కి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం.…— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2023