Switch to English

వేవ్స్ కమిటీలో మెగాస్టార్.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,845FansLike
57,764FollowersFollow

భారత్ ను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో వరల్డ్ ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ని నిర్వహించే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో ఇండియన్ సినీ, పారిశ్రామిక ప్రముఖులందరితో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వేవ్స్ లో సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ముఖేష్ అంబానీ, ఆనంద్ మహేంద్రాతో పాటుగా మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, మోహన్ లాల్, రజినీకాంత్, అమీర్ ఖా, అక్షయ్ కపూర్, రణ్ బీర్ కపూర్, ఏ.ఆర్ రెహమాన్ కూడా ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

 

తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవిని వేవ్స్ అడ్వైజరీ బోర్డులో భాగం చేశారు. వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఆర్ధిక రంగం కోసం దావోస్ ని ఎలా ఎంపిక చేసిందో.. వినోద పరిశ్రమ కోసం అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సుగా వేవ్స్ ని రూపొందించాలని కేంద్రం ప్లాన్ చేస్తుంది. వినోద, సృజనాత్మకత, సంస్కృతిలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని అంటున్నారు.

వేవ్స్ లో మెంబర్ అయినందుకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. వేవ్స్ అడ్వైజరీ బోర్డ్ లో భాగం కావడం మిగతా గౌరవనీయులైన సభ్యులతో నా ఆలోచలను పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు చిరంజీవి. త్వరలో జరగనున్న అద్భుతాల కోసం మనమంతా ఎదురుచూస్తుండాలని అన్నారు చిరంజీవి.

అంతేకాదు ఈ మీటింగ్ పై ప్రధాని మోదీ స్పందించారు.. వినోద, సృజనాత్మకత, సంస్కృతి ప్రపంచాన్ని ఒకచోట చేర్చే వేవ్స్ అడ్వైజరీ బోర్డ్ సమావేశం ముగిసింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ మద్ధతు తెలియచేయడమే కాకుండా భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చడానికి కావాల్సిన సూచనలు, సలహాలు అందించారని ప్రధాని మోదీ అన్నారు.

సినిమా

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్‌ వేరు..?

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఈ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల సంయుక్తంగా...

వాళ్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారన్న విషయం తెలిసిందే. యూకే పార్లమెంట్ లో చిరంజీవికి...

చట్ట విరుద్దంగా రానా ఏం చేయలేదు

బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న తెలుగు యూట్యూబర్స్‌పై కేసులు పెడుతున్న తెలంగాణ పోలీసులు ఇటీవల సినిమా హీరోలు, హీరోయిన్స్‌పైనా కేసులు నమోదు చేశారనే వార్తలు వచ్చాయి....

విజయ్ దేవరకొండపై కేసు.. స్పందించిన టీమ్..!

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీస్ అందరిపైన కేసు ఫైల్ చేసి పోలీసులు నోటీసులు పంపిస్తున్న విషయం తెలిసిందే. వారి వల్ల ఎంతోమంది ప్రజలు...

ఉపాసన.. జాన్వి.. క్రేజీ పిక్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్...

రాజకీయం

దొంగ సంతకాలు: ఆ ఎమ్మెల్యేలకి ప్రజాధనమెందుకు దోచిపెడుతున్నట్టు.?

కొందరు ప్రజా ప్రతినిథులు దొంగ సంతకాలు పెడుతున్నారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంలేదు. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, గౌరవంగా అసెంబ్లీకి రావాలిగానీ, దొంగతనంగా వచ్చి, హాజరు పట్టీలో సంతకాలు పెట్టడమెందుకు.? ఈ ప్రశ్న సాక్షాత్తూ...

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

జన్మ భూమి, కర్మ భూమి.! నరేంద్ర మోడీ అలా.! పవన్ కళ్యాణ్ ఇలా .!

దేశ రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు దేశ ప్రజానీకం. అందులో ఒకరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాగా, మరొకరు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని...

34 రోజులు నిరంతరాయంగా రామ్ 22..!

ఉస్తాద్ రామ్ లేటెస్ట్ మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్...

కొల్లేరు సమస్య.. వైఎస్సార్ నుంచి వైసీపీ వరకు..!

ఆపరేషన్ కొల్లేరు పేరుతో 2006 లో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భయానక రీతిలో నాటు బాంబులతో కొల్లేరు చెరువు గట్లు పేల్చేసిన విధానం నుంచి వైసీపీ నాయకుడు కొల్లేరు పూర్వ వైభవం...

ఎక్కువ చదివినవి

టీడీపీ కార్యకర్తే అధినేత

కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే మాటను తెలుగు దేశం పార్టీ నాయకత్వం ఆచరణలో పెట్టేందుకు సిద్ధం అయింది. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్త కోసం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 19 మార్చి 2025

పంచాంగం తేదీ 19-03-2025, బుధవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ పంచమి రా. 8.58 వరకు...

విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానాలపై కేసు నమోదు..!

అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్స్ మీద తెలంగాణ పోలీసులు సీరియస్ యాక్షన్ లోకి దిగారు. ఇప్పటికే తమ స్వలాభం కోసం డబ్బుకి ఆశపడి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన...

వైసీపీకి షాక్: ముందు ఎమ్మెల్సీలు.. ఆ తర్వాతే ఎమ్మెల్యేలు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఓ ఎమ్మెల్సీ గుడ్ బై చెప్పేశారు. అంతకు ముందు నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి దూరమయ్యారు. ఇంకోపక్క, వైసీపీ నుంచి ముందు ముందు మరిన్ని వలసలు తప్పవన్న చర్చ...

Daily Horoscope: రాశి ఫలాలు: సోమవారం 17 మార్చి 2025

పంచాంగం తేదీ 17-03-2025, సోమవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, ఫాల్గుణ మాసం, శిశిర ఋతువు. సూర్యోదయం: ఉదయం 6.13 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 గంటలకు. తిథి: బహుళ తదియ సా. 4.57 వరకు,...